
‘ఎఫ్ 2’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విక్టరీ వెంకటేష్ తన తరువాత సినిమాల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. కాగా ఈ క్రమంలోనే తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాని తెలుగులో ‘నారప్ప’ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నారు. ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ఈ అసురన్ సినిమాని తెలుగులో కొన్ని మార్పులు చేసి తీస్తున్నారని తెలుస్తోంది. లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో స్క్రిప్ట్ వర్క్ చేశారట. ముఖ్యంగా వెంకటేష్ టైమింగ్ కి తగ్గట్లు కొన్ని కొత్త సీన్స్ ను రాశారట. వెంకటేష్ క్యారెక్టర్ సీరియస్ గా సాగిన.. ఆ సీరియస్ నెస్ లో వెంకటేష్ చేసే యాక్టివిటీస్ తో ఫన్ జనరేట్ అయ్యేలా చేయాలని శ్రీకాంత్ అడ్డాల మార్పులు చేసినట్టు తెలుస్తోంది.
ఇక వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా తమిళనాట సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తోంది. ఇక వెంకీ మరో రీమేక్ లో కూడా నటించబోతున్నాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ లో నటించడానికి వెంకీ – రానా ఇంట్రస్ట్ గా ఉన్నారట. ఒరిజినల్ వర్షన్ లో పోలీస్ క్యారెక్టర్ చేసిన బిజూ మీనన్ పాత్రలో తెలుగులో వెంకీ చేయబోతున్నాడట. అలాగే మరో హీరో పాత్రలో రానా నటిస్తాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగులో ఈ రీమేక్ చేయబోతోంది.