
టాలీవుడ్ లో తెలుగు బ్యూటీ ఇషా రెబ్బా జర్నీ ఒక అడుగు ముందుకు పడితే, నాలుగడుగులు వెనక్కి పడుతుంది. కెరీర్ పరంగా తాను ఆశించినది ఒకటి.. పాపం ఆమెకు తక్కుతుంది ఇంకొకటి అట. అమ్మడు కూడా ఇదే ఫీలింగ్ లో ఉందట. ఆమె నటించిన గత సినిమాలు అరవింద సమేత, ‘రాగల 24 గంటల్లో’ సినిమాలతో హిట్ అందుకున్న ఆ స్థాయిలో తనకు గుర్తింపు రావడంలేదని అమ్మడు తెగ ఇదయపోతున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి మొదటి నుంచీ ఈషాకి చెపుకోదగ్గ అవకాశాలొచ్చినా ఆశించిన విజయాలు అయితే దక్కలేదు.
దాంతో చివరికీ అమ్మడు రూట్ మార్చి బోల్డ్ క్యారెక్టర్స్ కూడా సై అని స్టేట్ మెంట్స్ ఇచ్చి మరీ చెప్పుకొచ్చింది. పైగా హాట్ స్టిల్స్ బాగా వదులుతుంది. ఈ మధ్య ఈషా రెబ్బ హాట్ స్టిల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కూడా. అయితే ఈ తెలుగు బ్యూటీ తన గ్లామర్ తోనే కాకుండా తన లేటెస్ట్ సినిమా అప్ డేట్ తో కూడా తాజాగా వార్తల్లో నిలిచింది. ఓ రొమాంటిక్ థ్రిల్లర్ లో ఈషా నటించనుంది. ఈ సినిమాలో సుశాంత్ హీరోగా నటించనున్నట్లు.. ఈ సినిమాకి రమేష్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
కాగా ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన, ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఆ తర్వాత ‘అమీతుమీ’, ‘అ’, అరవింద సమేత లాంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి ఇప్పుడు తనే ప్రధాన పాత్రలో ఓ హర్రర్ థ్రిల్లర్ తో రాబోతుంది. అన్ని కుదిరితే అక్టోబర్ నుండి ఈ చిత్రం షూట్ కి వెళ్లనుంది.