Homeఎంటర్టైన్మెంట్Prabhas Spirit Movie Updates: 'రాజా సాబ్' మేకర్స్ చేతుల్లోకి వెళ్లిన 'స్పిరిట్'..ఇదేమి ట్విస్ట్ సామీ..పాపం...

Prabhas Spirit Movie Updates: ‘రాజా సాబ్’ మేకర్స్ చేతుల్లోకి వెళ్లిన ‘స్పిరిట్’..ఇదేమి ట్విస్ట్ సామీ..పాపం ప్రభాస్ ఫ్యాన్స్!

Prabhas Spirit Movie Updates: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన ‘రాజా సాబ్'(The Rajasaab) చిత్రం కమర్షియల్ గా ఎలాంటి డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభాస్(Rebel Star Prabhas) ఫ్యాన్స్ ఈ సినిమా పేరు వినగానే వణికిపోయే రేంజ్ ఫ్లాప్ అయ్యింది. దాదాపుగా థియేట్రికల్ రన్ ని కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దాదాపుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించింది. విడుదలకు ముందు అంత రేంజ్ బిజినెస్ జరగలేదు. ఇక విడుదల తర్వాత సంగతి గురించి చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయింది ఈ చిత్రంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. వేరే నిర్మాణ సంస్థ అయితే ఈపాటికి మూత పడిపోయి ఉండేది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కి ప్రపంచవ్యాప్తమగు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ నిలబడ్డాడు.

కేవలం ‘రాజా సాబ్’ చిత్రం మాత్రమే కాదు, ఈ సంస్థ నుండి ఈమధ్య కాలం లో వచ్చిన ప్రతీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. గత ఏడాది విడుదలైన ‘మిరాయ్’ చిత్రం ఒక్కటే కాస్త ఈ సంస్థకు లాభాలను తెచ్చిపెట్టాయి. ఇకపోతే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ని చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు వణికిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సందీప్ వంగ ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్'(Spirit Movie) మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఈ సంస్థ చేతుల్లోనే ఉంది అట. గతం లో ఈ సంస్థ ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మనమంతా చూసాము. ప్రభాస్ తో ఈ సంస్థ కలయిక అసలు కలిసిరావడం లేదు. రెండు సార్లు చావు దెబ్బ తగిలింది.

ప్రభాస్ ఫ్యాన్స్ కి ‘స్పిరిట్’ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా మీదనే వాళ్ళు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ కొట్టేంత సత్తా ఉంది. అలాంటి ప్రాజెక్ట్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేతుల్లో పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ సందీప్ వంగ ని ప్రభాస్ ఫ్యాన్స్ ట్యాగ్ చేసి అడుగుతున్నారు. ఈ సంస్థ కొనుగోలు చేసిన సినిమాలకు సరైన రిలీజ్ లు ఇవ్వరు , నైజాం ప్రాంతం లో ఈ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో టై అయ్యి ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘రాజా సాబ్’ కి ఆ ప్రాంతం లో ఎలాంటి నష్టం చేసిందో అందరూ కళ్లారా చూశారు. ఇప్పుడు కేవలం మొదటి రోజే నైజం ప్రాంతం లో 30 కోట్ల షేర్ ని రాబట్టేంత సత్తా ఉన్నటువంటి ‘స్పిరిట్’ ని ఆ రెండు నిర్మాణ సంస్థల చేతుల్లో పెట్టి నాశనం చేయొద్దని స్పిరిట్ మేకర్స్ ని ప్రాధేయపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ మాటలను పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper