Sobhita Dhulipala: టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న జంటల్లో ఒకటి నాగ చైతన్య , శోభిత ధూళిపాళ్ల జంట. సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళకు నాగ చైతన్య ఈమెని కాఫీ షాప్ లో కలవడం , అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య మొదలైన స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారడం, ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరు వైవాహిక బంధం లోకి అడుగుపెట్టి ఏడాది దాటింది. అయితే పెళ్లి తర్వాత శోభిత సినిమాలను మానేస్తుందేమో అని అంతా అనుకున్నారు కానీ , అలాంటిదేమి జరగలేదు. రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ వీడియో ఎక్సక్లూసివ్ మూవీ చీకటి అనే చిత్రం లో హీరోయిన్ గా నటించిన ఈమె , ఇప్పుడు తమిళం లో ‘వెట్టువన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సోషల్ మీడియా లో ఈమె చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారింది.
ఆమె మాట్లాడుతూ ‘నేను ఎవరి మాట ని అంత తేలికగా నమ్మి , ఫాలో అయ్యే మనిషిని కాదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే , మన మనసు చెప్పే వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి అనే సత్యాన్ని బలంగా అనుసరించే మనిషిని. అలా నా మనసు చెప్పిన మాటల్ని వినడం వల్లే, నా జీవితం లో ఎన్నో అద్భుతమైన క్షణాలను ఆస్వాదించాను. కొన్ని కొన్ని సార్లు మనసు చెప్పే మాటలు పాటించడం కష్టం అవ్వొచ్చు , అయినప్పటికీ కూడా నేను నా అంతరాత్మ చెప్పే మాటలనే బలంగా నమ్ముతాను. మనసు చెప్పిన మాట ని వినకుండా చేసిన పని ఏది కూడా నా జీవితం లో సఫలం అవ్వలేదు. ఎల్లప్పుడూ మనల్ని మనం గౌరవించుకుంటూ ముందుకు పోవాలి , జీవితం అనేది ఒక చిన్న నదిపై సాగే నావ లాంటిది. ప్రతీ క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి’ అంటూ చెప్పుకొచ్చింది శోభిత.