Homeఎంటర్టైన్మెంట్Shivaji : మల్లెమాలతో విబేధాలు..జబర్దస్త్ నుండి శివాజీ అవుట్..రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్!

Shivaji : మల్లెమాలతో విబేధాలు..జబర్దస్త్ నుండి శివాజీ అవుట్..రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ కమెడియన్!

Shivaji : ఈటీవీ లో సుమారుగా దశాబ్దం కి పైగా కొనసాగుతున్న కామెడీ షో జబర్దస్త్ ప్రస్తుతం రేటింగ్స్ విషయంలో కష్టకాలాన్ని ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర ఇలా ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ మోస్ట్ కమెడియన్స్ గా కొనసాగుతున్న వీళ్లంతా జబర్దస్త్ షో మానేసినప్పటి నుండి ఈ షోకి టీఆర్ఫీ రేటింగ్స్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. పాత వాళ్లలో కేవలం ఆటో రాంప్రసాద్ ఒక్కడే కొనసాగుతున్నాడు. కానీ సుధీర్, గెటప్ శ్రీను లేని ఆటో రాంప్రసాద్ ని ఆడియన్స్ అసలు ఊహించుకోలేకపోతున్నారు. దీంతో ఒకప్పుడు 9 కి తగ్గకుండా టీఆర్ఫీ రేటింగ్స్ ని సాధించిన ఈ కామెడీ షో, ప్రస్తుతం మూడు టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకోవడానికి చాలా కష్టపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జబర్దస్త్ షో కి నాగబాబు, రోజా వ్యాఖ్యాతలుగా వ్యవహరించే వారు, ఇప్పుడు వాళ్లిద్దరూ లేని లోటు కనిపిస్తుంది.

ఇదంతా పక్కన పెడితే గత కొంత కాలం నుండి ప్రముఖ హీరో, బిగ్ బాస్ సీజన్ 7 టాప్ 3 కంటెస్టెంట్ శివాజీ ‘జబర్దస్త్’ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ప్రముఖ హీరోయిన్ లయ కూడా ఈ షో లో జడ్జి గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వారం ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్స్ కి శివాజీ రాలేదు. ఆయనకీ బదులుగా ఇంతకు ముందు జడ్జి గా వ్యవహరించిన ప్రముఖ కమెడియన్ కృష్ణ భగవాన్ వచ్చాడు. అయితే శివాజీ కేవలం ఈ వారం ఒక్కటే జబర్దస్త్ షోకి రాలేదా?, లేకపోతే ఇక నుండి ఆయన శాశ్వతంగా ఈ షోకి గుడ్ బై చెప్పేశాడా అనేది స్పష్టంగా తెలియట్లేదు. సోషల్ మీడియా లో వినిపిస్తున్న రూమర్ ఏమిటంటే, రేటింగ్స్ సరిగా రాకపోవడంతో శివాజీ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేమని మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నాడట.

ఈ విషయంలో వీళ్లిద్దరి మధ్య చిన్నపాటి విబేధాలు రావడంతో, శివాజీ ఈ షో నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే వారం నుండి శివాజీ ఈ షో కి రాకపోతే సోషల్ మీడియా లో ప్రచారమయ్యే ఈ రూమర్ నిజమని ఖాయం చేసుకోవచ్చు. మరోపక్క శివాజీ హీరోయిన్ లయతో కలిసి ఒక సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి శివాజీనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా ఓపెనింగ్ కి దిల్ రాజు, బోయపాటి శ్రీను వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేసి కెమెరా స్విచ్ ఆన్ చేసి, క్లాప్ కొట్టారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. గతంలో శివాజీ, లయ కాంబినేషన్ లో ‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్ళీ అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular