Senior Hero Naresh: ఎనభయ్యో దశకంలో ప్రముఖ హీరోగా వెలుగొందిన వీకే నరేష్ అప్రతిహ విజయయాత్ర కొనసాగించారు. నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, చిత్రం భళారే విచిత్రం లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విజయ నిర్మల తనయుడిగా ప్రత్యేకతను చాటుకున్నారు. అప్పట్లో ఆయన తీసిన చిత్రాలు విజయవంతమయ్యాయి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తండ్రి, మామ లాంటి పాత్రల్లో కూడా జీవిస్తున్నారు. నరేష్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.
ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అచ్చి రాలేదు. ఎవరితో కూడా కడదాకా ఉండలేదు. దీంతో ఆయన వైవాహిక జీవితం ఓ దుర్భరమే. పెళ్లిళ్లు కలిసి రాకపోవడంతో ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నా పవిత్ర లోకేష్ అనే క్యారెక్టర్ ఆర్టిస్టుతో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్తున్నారని ప్రచారం సాగుతోంది. అంతే కాదు ఏ విందులు, వినోదాలకైనా వారిద్దరు కలిసి వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి.
Also Read: Police Viral Video: పోలీసా? మజాకా.. సినిమాల కంటే మించి రియల్ ఫైట్.. వైరల్ వీడియో..
మూడు పెళ్లిళ్లు విఫలం కావడంతో ఇక నాలుగో పెళ్లిపై నరేష్ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు తల్లితో ఉన్నా ఆమె కూడా లేకపోవడంతో ఇక సహజీవనం అవసరమే అనే అభిప్రాయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అందుకే ఆమెను నాలుగో వివాహం చేసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. దీంతోనే వారిద్దరు కలిసి ఉంటున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల వారు ఓ స్వామిజీని దర్శించుకుని తమ కోరికను బయటపెట్టినట్లు భోగట్టా.
పవిత్ర తన భర్తతో కుదరక విడిగానే ఉంటోంది. కానీ వారు ఇంకా విడాకులు తీసుకోలేదు. అందుకే చట్టపరంగా విడాకులు తీసుకున్నాక నరేష్ పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. జీవితానికి తోడు ఉండాల్సిందే. అది ఏ వయసులోనైనా కావాల్సిందే. అందుకే వారిద్దరు వివాహం చేసుకుని తమ ప్రయాణం కొనసాగించాలని బావిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం వారు ఇంకా కొన్ని రోజులు ఆగినా సరే వివాహం మాత్రం చేసుకునేందుకే ప్రాధాన్యం ఇష్తున్నట్లు చెబుతున్నారు.
Also Read:Unstoppable Season-2: బాలయ్య ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్… అన్ స్టాపబుల్ సీజన్ 2 వచ్చేస్తుంది
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More