Rajasekhar begged Allu Aravind: టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, తొలుత క్యారక్టర్ రోల్స్ , విలన్ రోల్స్ చేస్తూ మంచి పాపులారిటీ ని సంపాదించి , ఆ తర్వాత హీరో గా ఎన్నో సంచలనాత్మక చిత్రాల్లో నటించి యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న నటుడు రాజశేఖర్(Dr Rajashekar). వైద్య వృత్తి ని వదిలి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈయన అప్పటి టాప్ 6 హీరోలలో ఒకరు. అయితే కాలం గడిచే కొద్దీ ప్రేక్షకుల అభిరుచులు మారుతూ ఉంటాయి. అలా తరాలు మారిపోవడం తో రాజశేఖర్ క్రేజ్, మార్కెట్ పూర్తిగా పడిపోయింది. 2010 తర్వాత అయితే ఆయన హీరో గా నటించిన సినిమాలు బాగున్నప్పటికీ కమర్షియల్ గా ఆడడం లో విఫలం అయ్యాయి. దీంతో రాజశేఖర్ ని ఇక జనాలు హీరో గా చూడడానికి అసలు ఇష్టపడడం లేదు అనే విషయం దర్శక నిర్మాతలకు అర్థమైంది.
అప్పటి నుండి ఆయన్ని హీరో గా పెట్టి సినిమాలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అందుకోసం విలన్ క్యారెక్టర్స్ వచ్చినా ఆయన చేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఆయన వద్దకు వచ్చే దర్శకులు కేవలం రొటీన్ విలన్ రోల్స్ మాత్రమే ఆయనకు చెప్తుండేవారట . అందుకు రాజశేఖర్ అసలు ఒప్పుకోలేదట. హీరో తో సమానంగా ఉండే ఢీ అంటే ఢీ అనే రోల్స్ కి మాత్రమే ఆయన పచ్చ జెండా ఊపేందుకు రెడీ ఉన్నాడట. ఆ సమయం లోనే అల్లు అరవింద్ రామ్ చరణ్ తో ‘ధృవ’ చిత్రాన్ని చేయబోతున్నాడు అనే విషయం రాజశేఖర్ కి తెలిసింది అట. ఇది తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘తన్ని ఒరువన్ ‘ అనే చిత్రానికి రీమేక్. అందులో అరవింద్ సామీ పోషించిన క్యారెక్టర్ అంటే రాజశేఖర్ కి చాలా ఇష్టమట.
Also Read: తమిళ హీరో విజయ్ కి విడాకులు ఇచ్చిన ఈ సంగీత ఎవరు ..? ఈమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే మతి పోవాల్సిందే!
ఆ క్యారక్టర్ ని తానూ తెలుగు లో చేస్తానని ముందుకొచ్చాడట రాజశేఖర్. అల్లు అరవింద్ ని రిక్వెస్ట్ కూడా చేసాడట . కానీ అల్లు అరవింద్ అందుకు ఒప్పుకోలేదట. అరవింద్ సామి తో అయితే మాకు తక్కువ ఖర్చు తో అయిపోతుంది, తమిళం లో ఆయన ఉన్న కొన్ని సన్నివేశాలను కూడా మేము వాడుకోవచ్చు. అందుకే ఈ పాత్రని మీకు ఇవ్వలేమని అన్నాడట రాజశేఖర్ . అలా ధృవ చిత్రం లో విలన్ క్యారెక్టర్ తనకు రానందుకు రాజశేఖర్ చాలా బాధపడ్డాడు అట . ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ఫ్యాన్స్, ఈ పాత్ర నీకు మిస్ అవ్వడం మాకు చాలా ప్లస్ అయ్యింది, లేదంటే సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.