Srujan Yarabolu: ఇటీవల ఓటిటి వేదికగా డిస్నీ + హాట్ స్టార్ లో విడుదలైన చిత్రం “అద్భుతం”. తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. అయితే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సుజన్ యరబోలు మాట్లాడుతూ… పంపిణీ రంగం నుంచి నిర్మాతగా మారినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓవర్సీస్లో సినిమాలను విడుదల చేయడంవల్ల కొన్నిసార్లు నిర్మాతలకంటే మాకే ఎక్కువ ఆదాయం వచ్చేవి. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలంటే ఎక్కువ మక్కువ చూపుతాను. మంచి కాన్సెప్ట్ లేకపోతే సినిమా తీయను అని చెప్పుకొచ్చారు.
నేను యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ జాబ్ చేస్తూనే సినిమాలు నిర్మిస్తున్నాను.”కంచె” సినిమాతో ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేయడంతో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత విడుదలైన ‘అర్జున్రెడ్డి’, ‘మహానటి’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’.. ఇలా దాదాపు ముప్ఫై సినిమాలను ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూట్ చేశాను అని అన్నారు. ఆ తర్వాత మను’, ‘సూర్య కాంతం’ నిర్వాణ బ్యానర్లో భాగమై తీసిన ఆశించిన ఫలితం దక్కలేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ స్టార్ట్ చేశాను మా బ్యానర్లో ప్రస్తుతం ఎనిమిది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ‘పంచతంత్రం’ రిలీజ్కు రెడీ అవుతోంది అలానే బ్రహ్మానందంగారి కుమారుడు గౌతమ్తో సినిమా చేస్తున్నాం. సంతోష్ శోభన్తో ఒక సినిమా “గతం” దర్శకుడు కిరణ్తో ఒక చిత్రాన్ని రూపొందించాం అని చెప్పారు. కరోనా బారి నుండి ఇప్పుడిప్పుడే ఓవర్ సీస్ మార్కెట్ మెరుగుపడుతుందని అలాగే పెద్ద చిత్రాలు నిర్మించే ఆలోచన ఉన్నామని సృజన్ యరబ్రోలు చెప్పుకొచ్చారు.