Homeఎంటర్టైన్మెంట్Pankaj Tripathi: బాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఇంత క్రేజ్ ఉందా..? వైరల్ అవుతున్న...

Pankaj Tripathi: బాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఇంత క్రేజ్ ఉందా..? వైరల్ అవుతున్న ‘మీర్జాపూర్’ నటుడి కామెంట్స్!

Pankaj Tripathi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్నటువంటి క్రేజ్, ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యూత్, మాస్ ఆడియన్స్ లో ఆయన రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంటుంది. ఇక రీసెంట్ గా రాజకీయాల్లోకి రావడం వల్ల మిడిల్ ఏజ్ గ్రూప్ లో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగిపోయింది. ఉపముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేస్తున్న పనులు జనాలను ఇంకా ఆకర్షితులను చేయడంతో అత్యంత ప్రజాధారణ ఆయనకు సొంతమైంది. గడిచిన ఎన్నికలలో ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు పవన్ కళ్యాణ్ అత్యంత కీలక పాత్ర పోషించాడు. అంటే కాదు తన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిపించి నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ గా జనసేనని నిలబెట్టడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.

ప్రతీ ఒక్కరు ఆయన గురించి ప్రత్యేకంగా చర్చించుకోవడం మొదలు పెట్టారు. అంతే కాదు దేశ ప్రధాని సైతం పార్లమెంట్ లో 300 మంది ఎంపీలు, ముఖ్యమంత్రుల సమక్షంలో ‘ఇతను పవన్ కాదు..తుఫాన్’ అని అనడంతో పవన్ కళ్యాణ్ పేరు నార్త్ ఇండియా లో మరింత వైరల్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఆయన సనాతన ధర్మం పరిరక్షకుడిగా తిరుపతి సభలో ఇచ్చిన వారాహి డిక్లరేషన్ ప్రసంగం దేశం మొత్తం ఉలిక్కి పడేలా చేసింది. పవన్ కళ్యాణ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేసింది. ఒక్క పాన్ ఇండియన్ సినిమా కూడా చేయకుండా పవన్ కళ్యాణ్ తన రాకీయంతో సంపాదించుకున్న ఫాలోయింగ్ ఇది. కాగా, బాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు ప్రముఖ నటీనటుల నుండి కూడా మంచి మద్దతు లభించడం విశేషం. రీసెంట్ గానే ‘మీర్జాపూర్’ నటుడు పంకజ్ త్రిపాఠి పవన్ కళ్యాణ్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.

ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గొప్ప నటుడు మాత్రమే కాదు, వివిధ అంశాలపై గొప్ప పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కూడా. ఎంతో దూరదృష్టితో ఆలోచించే తత్త్వం కూడా ఉంది. ఈ విషయాన్ని నాకు ఎంతో మంది డైరెక్టర్స్ చెప్పుకొచ్చేవారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ కి ఇతర రాష్ట్రాల్లో కూడా అభిమానులు భారీ స్థాయిలో ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు పంకజ్ త్రిపాఠి. ఇది ఇలా ఉండగా ఈయన పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన పై ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరించలేదు కానీ, త్వరలో మొదలవ్వబోయే షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు పంకజ్ త్రిపాఠి కూడా పాల్గొనబోతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే ఆయన ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలను ప్రారంభిస్తాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular