Homeఎంటర్టైన్మెంట్ఈ విజయం నీకే సొంతం.. నటుడి ట్విట్ వైరల్..

ఈ విజయం నీకే సొంతం.. నటుడి ట్విట్ వైరల్..

Naveen Polishetty
కొంతమందితో గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. మనిషి భౌతికంగా మనదగ్గర లేకపోయినా.. వారితో పెనవేసుకున్న బంధం ఆ సంబంధాలు సజీవంగా నిలుపుతుంది. ఇందుకు తాజా నిదర్శనం తెలుగు హీరో నవీన్ పొలిశెట్టి ట్విట్ అని చెప్పుకోవచ్చు. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు ఇండస్ర్టీ పంట పండిందని చెప్పుకోవచ్చు. 2019 సంవత్సరానికి గానూ.. తెలుగు సినిమా ఏకంగా నాలుగు అవార్డులను దక్కించుకుంది. ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు మహర్షి సినిమాకు రెండు.. నేచురల్ స్టార్ నాని జెర్సీకి మరో రెండు అవార్డులు వచ్చాయి.

Also Read: కంగనాకు అవార్డు.. కారణం అదేనా..?

ఇదే సందర్భంలో టావీవుడ్ గర్వించాల్సిన మరో అవార్డు కూడా ఉంది. తెలుగ హీరో నవీన్ పొలిశెట్టి నటించిన చిచోరే కు ఉత్తమ హిదీ చిత్రం అవార్డు లభించింది. ఈ సినిమాలో దివంగత నటుడు సుశాంత్ రాజ్ సింగ్ ముఖ్యపాత్రలో నటించాడు. ఈ సంతోషకర క్షణాలను ఆస్వాధించడానికి సుశాంత్ భౌతికంగా మనమధ్యన లేకపోవడంతో నవీన్ తన మిత్రుడిని తలుచుకుని సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా నవీన్ చేసిన ట్విట్ వైరల్ అయ్యింది. ఇంతకూ నవీన్ ఏమన్నాడంటే..

Also Read: ‘దీపికా’ అసలు గ్యాప్ ఇచ్చేలా లేదు !

ఓ వైపు చిచోరే సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. మరో వైపు జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సుశాంత్.. ఇదంతా నువ్వు చూస్తున్నావని నాకు తెలుసు. ఇది నీకే సొంతం. అలాగే చిత్ర యూనిటుకు శుభాకాంక్షలు. లవ్ యూ యాసిడ్ అంటూ ట్విట్ చేశాడు. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ యాసిడ్ పాత్రలో నవీన్ నటించి హిందీ ప్రేక్షకులకు నవ్వులు పంచాడు. అందుకే తన ట్విట్ లో లవ్ యూ యాసిడ్ అటూ ప్రత్యేకంగా చెప్పాడు నవీన్.

ఈ సారి జాతీయ అవార్డులకు తెలుగు చిత్రాలు చాలా ఎంపికయ్యాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ప్రస్తుతం జాతిరత్నాలు హిట్ కొట్టింది. హీరో.. డైరెక్టరు.. కో యాక్టర్లకు సినిమా మంచి పేరును తీసుకొచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న సినిమాల్లో జాతిరత్నాలు మంచి ఫ్యామిలీ.. కామెడీ ఎంటర్ టైన్మెంట్ అంటూ ప్రేక్షకులు సైతం మార్కులు వేసేస్తున్నారు. ఈ క్రమంలో నవీనుకు అవార్డు రావడం సంతోషించదగిన విషయం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular