Homeఎంటర్టైన్మెంట్Nandamuri Hero In Mahesh Movie: మహేష్ - త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా నందమూరి...

Nandamuri Hero In Mahesh Movie: మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా నందమూరి హీరో.. షాక్ లో ఫాన్స్

Nandamuri Hero In Mahesh Movie: వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..అతడు , ఖలేజా వంటి క్లాసిక్ సినిమాల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ మూవీ పై అటు అభిమానుల్లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో, ఇటు ట్రేడ్ లో కూడా అదే స్థాయి అంచనాలు ఉన్నాయి..రెండు నెలల క్రితం పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ లేదా జులై నెలలో సెట్స్ మీదకి వెళ్లనుంది..ఇప్పటికే ఈ సినిమాకి సంబందించి ఒక్క కాలనీ సెట్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించారు..త్రివిక్రమ్ రైటర్ గా పని చేస్తున్న సమయం లో ఆయన కలం నుండి జారిపడిన అద్భుతమైన క్లాసిక్ ‘నువ్వు నాకు నచ్చావ్’ అనే సినిమా..విక్టరీ వెంకటేష్ మరియు విజయ్ భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు..లేటెస్ట్ గా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..ఈ సినిమాని ఆ తరహాలో పూర్తి స్థాయి ఫన్ తో కూడిన ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు అట త్రివిక్రమ్ శ్రీనివాస్.

Nandamuri Hero In Mahesh Movie
Mahesh, Trivikram

ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయం లో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు అట త్రివిక్రమ్..సోషల్ మీడియా లో లేటెస్ట్ గా సాగుతున్న ప్రచారం ఏమిటి అంటే, ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం నందమూరి కుటుంబానికి చెందిన నందమూరి తారక రత్న ని సంప్రదించినట్టు తెలుస్తుంది..హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన తారక రత్న కి ఇప్పటి వరుకు ఒక్క సక్సెస్ కూడా రాలేదు..ఇక ఈయనని హీరో గా పెట్టి సినిమాలు చేసేందుకు కూడా ఏ దర్శక నిర్మాత ఆసక్తి చూపించడం లేదు..ఇలాంటి సమయం లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ దక్కడం నిజంగా తారక రత్న కి అదృష్టం అనే చెప్పాలి..విలన్ గా తన నటనతో ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకోగలిగితే సౌత్ ఇండియా జగపతి బాబు లాగ మోస్ట్ వాంటెడ్ క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎదిగే ఛాన్స్ కూడా లేకపోలేదు..హీరో గా సక్సెస్ కాలేకపోయినా నందమూరి తారకరత్న కనీసం క్యారక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి మరి.

Nandamuri Hero In Mahesh Movie
Tarakratna

Also Read: Jabardast: జబర్ధస్త్ షాకింగ్ నిర్ణయం.. ఇలా చేయడానికి కారణమేంటి?

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు..ఇక ఈ సినిమాకి టైటిల్ ని ‘అర్జునుడు’ అని పెట్టడానికి దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నారు..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 31 వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా బయటకి వెలువడే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట..ఇది ఇలా ఉండగా కథ రీత్యా ఈ సినిమాలో ఒక్క యువ హీరో మహేష్ బాబు కి తమ్ముడిగా నటించే స్కోప్ ఉంది అట..ఈ పాత్రని కేవలం యువ హీరో మాత్రమే చేసే పాత్ర అని త్రివిక్రమ్ టాలీవుడ్ యువ హీరోలందరిని ఈ పాత్ర కోసం అడుగుతునట్టు సమాచారం..ఇప్పటికే న్యాచురల్ స్టార్ నాని ని మూవీ యూనిట్ సంప్రదించినట్టు తెలుస్తుంది..కానీ ఆయన ఈ సినిమాలో నటించేందుకు నిరాకరించినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..దానితో ఈ మూవీ టీం శర్వానంద్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది..ఆయన ఒక్కవేల ఈ సినిమాకి డేట్స్ ఇచ్చేస్తే దానికి తగట్టు గా షెడ్యూల్స్ ని ప్లాన్ చెయ్యడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారట.

Also Read: KA Paul: ఈ వీడియో చూస్తే ఇక ఎవరూ కేఏ పాల్ ను ‘కామెడీ పీస్’ అనరు?

Recommended Videos:

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular