Homeఎంటర్టైన్మెంట్Mohanlal Wife: నా భర్త చేసే చెత్త సినిమాలను చూసి నరకం అనుభవించాను అంటూ మోహన్...

Mohanlal Wife: నా భర్త చేసే చెత్త సినిమాలను చూసి నరకం అనుభవించాను అంటూ మోహన్ లాల్ సతీమణి షాకింగ్ కామెంట్స్!

Mohanlal Wife: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో వైవిద్యభరితమైన పాత్రలను పోషిస్తూ లెజెండ్స్ జాబితా లో చేరిన మహానటుడు మోహన్ లాల్. మలయాళం సినీ ఇండస్ట్రీ ప్రతిష్టని దేశం నలుమూలల చాటి చెప్పిన దిగ్గజ నటుడు ఆయన. సుమారుగా మూడు దశాబ్దాల నుండి ఎన్నో అద్భుతమైన కల్ట్ క్లాసిక్ చిత్రాలను, ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన ఆయన, కేవలం మలయాళం సినీ ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం కాకుండా, తెలుగు, తమిళ భాషల్లో కూడా అనేక సినిమాలు చేసాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో అన్నిటికంటే చిన్న సినీ పరిశ్రమ గా మలయాళం సినీ పరిశ్రమని పరిగణిస్తారు ట్రేడ్ విశ్లేషకులు. అలాంటి ఇండస్ట్రీ నుండి మొట్టమొదటి వంద కోట్ల రూపాయిల గ్రాస్ సినిమాని అందుకున్న హీరోగా మోహన్ లాల్ నిలిచాడు. దీనిని బట్టీ ఆయన స్టార్ స్టేటస్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కేవలం కమర్షియల్ స్టార్ హీరోగా మాత్రమే కాదు, నటుడిగా ఈయన ఎన్నో జాతీయ అవార్డులను అందుకున్నాడు. అయితే ఆయన సతీమణి సుచిత్ర రీసెంట్ గా మోహన్ లాల్ సినిమాల గురించి ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నా భర్త చేసే సినిమాలలో కూడా నాకు నచ్చనివి ఉన్నాయి. కొన్ని సినిమాల్లో అయితే నా భర్త ని ఆ పాత్రల్లో చూడలేకపోయాను. నాకు నచ్చకపోతే నేరుగా అతనికే చెప్పేదానిని. మోహన్ లాల్ కూడా నా రివ్యూస్ కి చాలా విలువ ఇస్తాడు. నా నుండి ఆయన సినిమాకి పాజిటివ్ రివ్యూ వచ్చిందంటే మాత్రం ఆ సినిమా హిట్ అని ఆయన బలంగా ఫిక్స్ అయిపోతాడు. అలా సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఒక సినిమా సక్సెస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం అనేది కేవలం ఒకరి మీద ఆధారపడి ఉండదు. ఎవరైనా మంచి సినిమా తియ్యడానికే ఇష్టపడుతారు. పనిగట్టుకొని ఫ్లాప్ సినిమా చెయ్యాలని ఎవ్వరూ కోరుకోరు’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇదంతా పక్కన పెడితే మోహన్ లాల్ మన తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ లో మోహన్ లాల్ పాత్రని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఎన్టీఆర్ తో సమానంగా ఆయన్ని చాలా పవర్ ఫుల్ గా చూపించాడు డైరెక్టర్ కొరటాల శివ. ఈ సినిమా తర్వాత మోహన్ లాల్ హీరో గా నటించిన సినిమాలన్నీ వరుసగా తెలుగు లో దబ్ అయ్యాయి. వాటిల్లో ‘మన్యం పులి’ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన పృథ్వీ రాజ్ దర్శకత్వం లో ‘లూసీఫర్ 2’ చిత్రాన్ని చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల కానుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular