Chiranjeevi- Taraka Ratna: నందమూరి తారకరత్న లోకేష్ పాదయాత్ర లో ప్రారంభం లో పాల్గొని గుండెపోటు వచ్చి కుప్పకూలిన సంగతి అందరికీ తెలిసిందే..ఆయన ఆరోగ్య స్థితి పై నందమూరి కుటుంబ సభ్యులు మరియు అభిమానులు ఎంతో ఆందోళన కి గురయ్యారు..సోషల్ మీడియా లో చాలా ఆయన ఆరోగ్యం పట్ల ఎవరికీ తోచినట్టు వాళ్ళు రాసుకున్నారు..కొన్ని సైట్స్ అయితే మానవత్వం కూడా మర్చిపోయి బ్రతికి ఉన్న తారకరత్న ని చనిపోయాడు అంటూ ప్రచారం చేసాయి..కానీ అవన్నీ అవాస్తవం అంటూ నందమూరి కుటుంబ సభ్యులు ఖరారు చేసారు.

తారకరత్న కి మెరుగైన వైద్యం అందించడం కోసం ఆయనని బెంగళూరులోని నారాయణ హాస్పిటల్ కి చేర్చారు..అక్కడ గత రెండు రోజుల నుండి స్పెషలిస్ట్స్ అద్వర్యం లో తారకరత్న కి చికిత్స జరుగుతుంది..ప్రస్తుతం ఆయన విషమ పరిస్థితి నుండి పూర్తిగా కోలుకోకపోయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది..చికిత్స కి బాగానే స్పందిస్తున్నాడు.

అయితే తారకరత్న ని చూసేందుకు నిన్న మెగాస్టార్ చిరంజీవి బెంగళూరు కి వెళ్ళాడు..ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై నందమూరి అభిమానులకు కాస్త ఊరట కలిగించే వార్త చెప్పాడు మెగాస్టార్ చిరంజీవి..ఆయన మాట్లాడుతూ ‘తమ్ముడు తారకరత్న ఆరోగ్యం కుదుటపడింది..ఆయన రోజు రోజుకి మరింత మెరుగ్గా కోలుకుంటున్నారు,ఇక ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం ప్రమాదం లేదు అనే మాట ఎంతో నాకు ఉపశమనాన్నిచ్చింది, తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది..తారకరత్న కి బ్రెయిన్ ఫంక్షనింగ్ దెబ్బ తినడం తో ప్రస్తుతానికి తాత్కాలికంగా కోమాలో ఉన్నాడు..ఆయనని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చేందుకు విదేశాల నుండి స్పెషలిస్ట్స్ వస్తున్నారు..నేటి నుండి వారి చికిత్స ప్రారంభం కానుంది.
సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి
ఆ భగవంతుడికి కృతజ్ఞతలు.May you have a long and healthy life dear Tarakaratna!
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2023