`టూటక్ టూటక్ టూటీయా` ఫేమ్ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఎట్టకేలకు కరోనా నుంచి బయట పడింది. మార్చ్ తొమ్మిదో తారీఖున లండన్ నుంచి ఇండియా కి వచ్చిన ఈ లక్నో గాయని వెంట వెంటనే రెండు , మూడు పార్టీ ల్లో పాల్గొంది. ఆ క్రమంలో మార్చ్ 14 వ తారీఖున కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. అయినాగానీ నిర్లక్ష్యం తో క్వారంటైన్ కి వెళ్లకుండా బయట తిరగడం జరిగింది.దాంతో కనికా కపూర్ మార్చ్ 20 వ తారీఖున కోవిడ్ 19 టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఆ తరవాత ఇప్పటి వరకు మార్చ్ 23, 24, 27, 31 తారీకుల్లో వరుసగా నాలుగుసార్లు జరిపిన టెస్టుల్లో కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. తాజాగా ఏప్రిల్ 4 న ఐదోసారి టెస్ట్ చేయగా నెగిటివ్ రావడం జరిగింది.
ప్రస్తుతం లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వీయ నిర్బంధంలో ఉన్న కనికా కపూర్ పూర్తి నెగిటివ్ వచ్చేంతవరకూ మరో 8 రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారని తెలుస్తోంది. ఆ టెస్టుల్లో కూడా నెగిటివ్ వస్తే కనికా పూర్తిగా కరోనాపై విజయం సాధించినట్లే. కాగా నెగిటివ్ రిపోర్ట్ రావడంపై కనికా కపూర్ కుటుంబ సభ్యులు, మిత్రులు మిక్కిలి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Kanika kapoor finally tests negative for coronavirus
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com