Kangana: ఎప్పుడూ వివాదాల్లో హాట్టాపిక్గా నిలుస్తుంటుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ఈ క్రమంలోనే సిక్కు వివాదంలో ముంబయి పోలీసుల ఎదుట హాజరు కానుంది. తన స్టేట్మెంట్ను నమోదు చేసేందుకు బుధవారమే కంగనా ముంబయి ఖార్ పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడిదింది. ఈ క్రమంలోనే ఈ రోజు తన స్టేట్మెంట్ను రికార్డు చేసేందుకు పోలీసు స్టేషన్ను చేరుకోనున్నట్లు సమాచారం.
కంగనా తరచూ ఏదో అంశంపై స్పందిస్తూ.. వివాదాలను మూటగట్టుకోవడం సాధారణమైపోయింది. గతంలో ఇటువంటి కేసులు చాలానే కంగనపై నమోదయ్యాయి. ఇప్పటికీ కొన్ని కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. కాగా, కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని వేర్పాటువాదులతో పోలుస్తూ.. సిక్కు సంఘంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది కంగనా. దీంతో సిక్కు సంస్థ ఆగ్రహానికి గురై.. కంగనపై కేసు పెట్టారు. ఈ క్రమంలోనే కంగనా ముంబయి పోలీసుల ఎదుట హాజరు కానుంది.
అయితే, ఇటీవలే ఈ వ్యవసాయ బిల్లును రద్దు చేస్తూ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రైతులతో పాటు, దేశమంతటా సంతోషం వ్యక్తం చేయగా.. కంగనా మాత్రం బీజేపీపై ట్వీట్లతో విరుచుకుపడింది. అసలు ఇదేం పాలనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కంగనకు ఈ వివాదాలు కొత్తేం కాదు, గతంలో పలు రాజకీయ, సామాజిక, సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ.. వివాదాల్లో నిలిచింది. మరి ఈ వివాదం ఎక్కడి వరకు దారి తీస్తుందో తెలియాల్సి ఉంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Kangana may appear before mumai police today on sikh controversy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com