
ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ చిత్రాలకున్న క్రేజ్ అంతా ఇంతాకాదు.. ఇప్పటికే ఈ బ్రాండ్ సిరీస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించాయి. తెలుగులో జేమ్స్ బాండ్ ల వలే హీరోలు కృష్ణ, మహేష్ బాబులు అలరించారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ బాండ్ సిరీస్ నుంచి 24 చిత్రాలు వెండితెరపై సందడి చేయగా.. ఇప్పుడు 25వ చిత్రంగా ‘నో టైమ్ టు డై’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తున్న చివరి చిత్రం ఇదీ.. విలన్ సఫీన్ గా ‘రామి మాలెక్’ నటిస్తున్నాడు. కారీ జోజి దర్శకుడు. గత ఏడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడీ చిత్రాన్ని సెప్టెంబరులో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
భారత్ లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 30న బాండ్ థియేటర్ లో సందడి చేయనున్నారు. అమెరికాలో అక్టోబరు 8న ‘నో టైమ్ టు డై’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. ఆద్యంతం అలరించేలా యాక్షన్ సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ ను మీరూ చూసేయండి..