సినిమా ఇండస్ట్రీలో మధ్యలో సినిమా ఆగిపోయిందని తెలియగానే ఇక ఆ సినిమాని కొనడానికి ఒక్క బయ్యరు కూడా ముందుకు రాడు. కారణాలు చాల ఉంటాయి. కథాకథనాల నుండి అధిక బడ్జెట్, అలాగే హీరో మార్కెట్ రేంజ్ వరకూ ఇలా సినిమా ఆగిపోవడానికి ఏదొక రీజన్ ఉంటుంది. కాగా ఎప్పుడో ఫైనాన్స్ కారణాలతో యాక్షన్ హీరో గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా ఆగిపోయిన బాగోతం గురించి తెలిసిందే.
గోపీచంద్ కి వక్కంత వంశీ ఈ సినిమా కథ చెప్పినప్పుడు, పైగా ఈ కథను బి గోపాల్ డైరక్షన్ చేయబోతున్నాడని ఎనౌన్స్ చేసినప్పుడు ఈ సినిమా పై ఎన్నో అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ ఈ సినిమాకి మధ్యలోనే ఫైనాన్స్ సమస్యలు రావడం, దాంతో నిర్మాత పివిపి ఎంటరై తొమ్మిది కోట్లు వరకూ ఇచ్చి.. మొత్తానికి ఈ సినిమాని తన చేతుల్లోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి.
ఎలాగూ పీవీపీ ఉన్నాడు కాబట్టి, సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే పీవీపీ సినిమాని రెడీ చేయించి.. పెద్ద ఎత్తున విడుదల చేయాలనుకున్నారు. కానీ అంతలో కరెక్ట్ గా రిలీజ్ చేసే టైమ్ కు, సడెన్ గా మిగిలిన ఫైనాన్సియర్లు సీన్ లోకి ఎంటర్ అవ్వడంతో ఈ సినిమా పై నీలినీడలు కమ్ముకున్నాయి. వ్యవహారం కోర్టుకు చేరింది. చివరకూ సినిమా విడుదలే ఆగిపోయింది.
అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో థియేటర్స్ లేవు. ఒకవేళ ఉన్నా జనం ఎవ్వరూ పోయేలా కనిపించడం లేదు. అందుకే ఇప్పడు ఈ సినిమాను ఓటిటికి అమ్మేసి, ఈ సినిమా కోసం చేసిన అప్పుులను క్లియర్ చేయించుకునే ఆలోచనలో ఉన్నాడు నిర్మాత తాండ్ర రమేష్. ఎలాగూ ఈ సినిమా డిజిటల్ ప్లస్ శాటిలైట్ కలిపి జీ టీవీకి గతంలో ఏడు కోట్ల మేరకు అమ్మేసారని ఆ మధ్య రూమర్స్ బాగా వినిపించాయి. మొత్తమ్మీద ఓటిటికి ఈ సినిమా అమ్మడానికి ఆ దిశగా చర్చల వ్యవహారం జరుగుతుంది.