బుల్లితెరపై సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీ జంట చేసే హంగామా మామూలుగా ఉండదు. వీళ్ల జంటకు సెపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దీంతో.. వీళ్లు ఒక షో అని కాకుండా.. ప్రతీ షోలోనూ కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఇక, వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందని సాగే ప్రచారానికి అంతేలేదు. అయితే.. తాజాగా సుధీర్ తో రిలేషన్ పై సంచలన ప్రకటన చేసింది రష్మీ.
నిజానికి టీవీ స్క్రీన్ పై రష్మీ గౌతమ్-సుధీర్ పై వచ్చినన్ని రూమర్స్ మరో జంటపై రాలేదంటే అతిశయోక్తి కాదు. ఈ రూమర్స్ ను కంటిన్యూ చేస్తూ వీళ్లు కొన్నేళ్లుగా ఫామ్ కొనసాగిస్తున్నారు. వీళ్ల బంధంపై ఎన్నో వార్తలు రావడం.. వాళ్లు అదేమీ లేదని చెప్పడం జరుగుతూనే ఉన్నాయి.
సందర్భం వచ్చిన ప్రతిసారీ.. సుధీర్ తనకు కేవలం స్నేహితుడు మాత్రమే అనిచెబుతూ వచ్చింది రష్మీ. సుధీర్ మాత్రం మై లక్కీ ఛామ్ అంటూ పాత పద్ధతినే ఫాలో అవుతూ వచ్చాడు. అయితే.. ఇది ఆన్ స్క్రీన్ మాత్రమే అని చెబుతుంటాడు కూడా. అంతేకాదు.. తనకు ఈ స్థాయిలో ఫేమ్ రావడంలో రష్మీ పాత్ర కూడా చాలా ఉందని పలు సార్లు చెప్పాడు.
కాగా.. ఇప్పుడు జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ వీడియోలో రాకేష్ మాస్టర్ సుధీర్ తో ‘నువ్వు ఎవరినైనా లవ్ చేశావా’ అని ప్రశ్నించాడు. దానికి.. ‘నేను ఎవరినీ చేయలేదుగానీ.. నా వెనుక ఓ అమ్మాయి పడుతోంది సార్’ అంటూ రష్మీని చూపించాడు. దీనికి.. రష్మీ స్పందిస్తూ ‘రోజా గారూ.. నేను అతడి వెంట పడ్డానా’ అని అడిగింది. దీంతో.. వాళ్లిద్దరికి సంబంధించిన కొన్ని రొమాంటిక్ విజువల్స్ ప్లే అయ్యాయి.
దీనికి రాకేష్ మాస్టర్ స్పందిస్తూ.. ‘ఇష్టపడితే పెళ్లి చేసుకోవచ్చు కదా’ అని అడిగాడు.. అప్పుడు సుధీర్ మాట్లాడుతూ.. ‘ఆల్రెడీ ఆహా నా పెళ్లంట షోలో గట్టిగా జరిగింది’ అన్నాడు. దానికి రష్మీ స్పందిస్తూ.. ‘నాకు సుధీర్ అంటే ఇష్టమే’ అని చెప్పింది. దీంతో.. వాళ్లిద్దరి చేతులను కలిపాడు రాకేష్ మాస్టర్. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే వారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.