దక్షిణ భారత దేశం లో లవ్ , థ్రిల్లర్ జానర్ లో సినిమాలు చేసే దర్శకుల్లో గౌతమ్ మీనన్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ..సున్నితమైన అంశాలతో సినిమాల్ని టెంపో తో నడపడం లో గౌతమ్ మీనన్ దిట్ట .
అందుకే లాక్ డౌన్ సమయం లో గౌతమ్ మీనన్ సినిమాల్ని జనాలు బాగానే చూస్తున్నట్లు తెలిసింది. వెంకటేష్ ఘర్షణ( రీమేక్) , సన్నాఫ్ సూర్య,, రాఘవన్,, ఏమాయ చేసావె (రీమేక్ ), చెలి ,,ఎంతవాడు గానీ. ..వంటి విభిన్న సినిమాలు తీసాడు. గౌతమ్ మీనన్ . ఇవన్నీ కూడా లాక్ డౌన్ పిరియడ్ లో జనాలకు బాగానే ఆనందం పంచుతున్నాయి . ఆ విషయం తెలుసుకొన్న గౌతమ్ మీనన్ నా సినిమాలు ఆదరిస్తున్నందుకు థాంక్స్ కానీ.. నా దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలు మాత్రం చూడొద్దని ప్రేక్షకుల్ని కోరుతున్నా అంటున్నాడు గౌతమ్.మీనన్ ….
ఇంతకీ గౌతమ్ మీనన్ లాక్ డౌన్ టైంలో చూడొద్దని కోరుతున్న రెండు సినిమాలు ఏంటో తెలుసా ? ఏమాయ చేసావె ,, ఎంతవాడు గానీ.(అజిత్ మూవీ ),, ఈ రెండు సినిమాల్లో కథానాయకులు నాగచైతన్య, అజిత్.. రోడ్ మీద తిరుగుతూ ఆహ్లాదంగా గడుపుతారు. ఇప్పుడు లాక్ డౌన్ టైములో ప్రేక్షకులు ఆ సినిమాలు చూస్తే.. వాళ్లకు బయట ప్రపంచంలో విహరించాలని అనిపిస్తుందని..కాబట్టి వాటికీ దూరంగా ఉండటం మంచిదని హితవు చెప్పాడు…
నిజంగానే ఆ రెండు సినిమాల్లో హీరోలు చేసే జర్నీ చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ప్రేక్షకుల హృదయాల్లో స్పందన తీసుకురావడంలో గౌతమ్ మీనన్ అందెవేసిన చేయి . .కనుక అలాంటి టెంప్టింగ్ మూవీస్ చూస్తే ప్రేక్షకుడికి బయట తిరగాలి అనిపిస్తుందని ముందు జాగ్రత్తగా గౌతమ్ మీనన్ హెచ్చరించాడు అని తెలుస్తోంది …
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Gautham menon urges people not to watch his two films
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com