Doctors Screen OG Movie for Patient: పేషెంట్స్ కి వైద్యం చేసేటప్పుడు అప్పుడప్పుడు డాక్టర్లు కొన్ని పద్ధతులు అనుసరిస్తుంటారు. ముఖ్యంగా మెదడుకి సంబంధించిన వైద్యం చేసేటప్పుడు , పేషెంట్ స్పృహలోనే ఉండాల్సి ఉంటుంది. ఆ సమయం లో వైద్యం చేయడం చాలా కష్టం. అందుకే పేషెంట్ దృష్టిని మరలించడానికి వాళ్లకు ఇష్టమైన సినిమాలను చూపించడమో , లేదా వాళ్ళని మాటల్లో పెట్టడమో చేస్తుంటారు. గతం లో ఒక పేషెంట్ కి ఇలాంటి ఆపరేషన్ చేయాల్సి వస్తే , ఆ పేషెంట్ కి ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అదుర్స్ సినిమాని చూపిస్తూ ఆపరేషన్ చేశారు . సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు పునరావృత్తం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లాలోని దర్శి ప్రాంతానికి చెందిన కోటేశ్వరమ్మ అనే మహిళా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. రీసెంట్ గానే ఆమెకు మూర్ఛ రావడం తో కిందపడిపోయారు.
ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా, ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టుగా MRI స్కాన్ ద్వారా గుర్తించారు వైద్యులు. దీంతో ఆమెకు అత్యవసర శస్త్రచికిత్స చేసి ట్యూమర్ ని తొలగించాలి. కానీ ఆమె స్పృహ లో ఉన్నప్పుడే ఈ వైద్యం చెయ్యాలని డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో ఆమెకు మానసికంగా ఎలాంటి భయం కలగకూడదని, ఆమె దృష్టిని మరలించి వైద్యం చేయడానికి , ఆమెకు ఎంతో ఇష్టమైన నటుడు పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ఓజీ చిత్రాన్ని చూపిస్తూ ఈ సర్జరీ నిర్వహించారు. ఈ టెక్నీక్ వల్ల రోగి మెదడు పనితీరుని సర్జరీ సమయంలోనే మానిటర్ చేసే అవకాశం డాక్టర్లకు దక్కింది. దీంతో చాలా తేలికగా, తలలోని కీలక భాగాలకు హాని కలగకుండా , ట్యూమర్ ని తొలగించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం ఒక మహిళా ప్రాణాలను కాపాడిందని పవన్ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు వేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
View this post on Instagram
