Preity Zinta: ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. అయితే ఈ భామ బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోలు సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు ప్రీతి జింటా. తాజాగా ఒక తీయటి కబురు ను సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు ప్రీతి.
సొట్ట బుగ్గల సుందరి తమకు ఇద్దరు కవల పిల్లలకు జన్మించారు అని తెలిపారు.ఈ అమ్మడు “సరో గసి “అద్దె గర్భం ద్వారా ఆమె ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రీతి జింటా తన భర్త జీన్ తో కలిసి దిగిన ఓ ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. సంతోష కరమైన వార్తను అందరితో పంచుకుంది ప్రీతి జింటా.
తమ పిల్లలకు జై జింటా, గియా జింటా అనే పేర్లు కూడా పెట్టింది ప్రీతి జింటా. అందరికీ నమస్కారం, ఈ రోజు మాకు అద్భుతమైన రోజు ఈ అనుభూతిని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. జీన్ నేను చాలా హ్యాపీ గా ఉన్నాము మా జై జింటా & గియా జింటా లు ఇద్దరు మా కుటుంబంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది మాకు ఈ సరోగసి ప్రక్రియ లో సహకరించిన డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి ధన్యవాదాలు అంటూ” ట్వీట్ చేసింది సొట్ట బుగ్గల సుందరి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.