Anasuya: యాంకర్ వింధ్య విశాఖ… క్రికెట్ ప్రియులకు ఈ పేరు బాగా తెలుసు. స్పోర్ట్స్ ఛానల్స్ లో తెలుగు ప్రెజెంటర్ గా మంచి పేరు సంపాదించింది. ఐపీఎల్, ప్రో కబడ్డీ తో పాటు పలు స్పోర్ట్స్ ఈవెంట్స్ కి వింధ్య ప్రజంటర్ గా చేస్తుంది. స్పోర్ట్స్ విశ్లేషణలలో ఎక్స్పర్ట్స్ తో పాటు ఆమె జాయిన్ అవుతారు. తెలుగులో లేడీ స్పోర్ట్స్ యాంకర్స్ చాలా తక్కువ. వింధ్య విశాఖకు ప్రత్యేకమైన స్థానం ఉంది. హెచ్ఎం టీవీ, స్టార్ మా, స్టార్ మ్యూజిక్ చానల్స్ లో పని చేసింది. ప్రస్తుతం ఫిమేల్ స్పోర్ట్స్ యాంకర్ గా రాణిస్తుంది.
యాంకర్ వింధ్య విశాఖ వివాదాలకు దూరంగా ఉంటుంది. ఇతర యాంకర్స్ మాదిరిగానే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. వాటిపై నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా ఆమె పట్టించుకోదు. కొంతమంది మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతుంటారు. వారికి కౌంటర్లు వేస్తూ కాంట్రవర్సీ కి తెరలేపుతుంటారు. విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.
అలాంటి వారికి కౌంటర్లు వేసింది యాంకర్ వింధ్య. కావాలనే కొంతమంది వార్తల్లో ఉండటానికి నెగిటివ్ కామెంట్స్ పై స్పందిస్తూ ఉంటారని… ఇన్ డైరెక్ట్ గా యాంకర్ అనసూయ కి చురకలు వేసింది. ఆమె మాట్లాడుతూ .. నేను ట్రెండీగా ఉంటాను .. రకరకాల ప్లేస్ లకు వెళ్ళినప్పుడు మోడ్రన్ డ్రెసుల్లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెడుతుంటాను. వాటిపై నెగిటివ్ కామెంట్స్ వస్తుంటాయి. నేను అసలు పట్టించుకోను. కానీ చాలా మంది పాపులర్ యాంకర్స్ వివాదాలు రాజేయాలని .. నెగిటివ్ కామెంట్స్ పై స్పందిస్తుంటారు.
నెగిటివ్ కామెంట్ రాగానే వెంటనే రిప్లై ఇస్తారు. దానికి వాడు మరో కామెంట్ పెడతాడు. అది న్యూస్ అవుతుంది. వాళ్ళు ఎందుకు నెగిటివ్ కామెంట్ పెడతారంటే మనం రియాక్ట్ కావాలని. మనం రెస్పాండ్ అవకపోతే గొడవే ఉండదు. కానీ వాళ్ళు వార్తల్లో ఉండటానికి కావాలని రియాక్ట్ అవుతుంటారు. అలాంటివి నాకు అవసరం లేదు. నెగిటివ్ కామెంట్స్ వచ్చాయని వాటిపై స్పందించి వార్తల్లో ఉండాలని అనుకోను అంటూ యాంకర్ వింధ్య చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ అనసూయ, రష్మీ గౌతమ్ లను ఉద్దేశించి వింధ్య చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.