Adipurush
Adipurush: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ఈ నెల 16 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పటి నుండో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఈ సినిమాకి మొత్తానికి మోక్షం లభించింది. తమ అభిమాన హీరో ని సాక్ష్యాత్తు శ్రీ రాముని అవతారం లో వెండితెర మీద చూడడం, ఫ్యాన్స్ తమకి దొరికిన అరుదైన అదృష్టంగా భావిస్తున్నారు. మూవీ టీం కూడా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపబోతున్నారు.
ఈ ఈవెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లో చిరస్థాయిగా గుర్తుండిపోయ్యేలాగ ఉంటుందట. సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులతో పాటుగా ఆధ్యాత్మిక గురువు చిన్నజియ్యర్ స్వామి కూడా ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధి గా పాల్గొనబోతున్నారు. ఇది ఇలా ఉండగా రామాయణం ని గౌరవిస్తూ మూవీ యూనిట్ లేటెస్ట్ గా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఇక అసలు విషయానికి వస్తే రామాయణం కి సంబంధించి ఏది జరిగిన అక్కడకి ఆంజనేయ స్వామి విచ్చేస్తాడని మన పూర్వికులు అంటూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలను విశ్వసిస్తూ ఆదిపురుష్ చిత్రం విడుదలయ్యే ప్రతీ థియేటర్ లో ఒక సీట్ ని ఖాళీగా ఉంచబోతున్నారట. అతి గొప్ప శ్రీ రాముని భక్తుడిగా ప్రసిద్ధి గాంచిన చిరంజీవి ఆంజనేయ స్వామి కి మర్యాదలు ఇస్తూ చరిత్ర ఎన్నడూ కూడా కనీవినీ ఎరుగని స్థాయి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మూవీ టీం.
నమ్మకాలను గౌరవిస్తూ, ఇంత గొప్ప కార్యక్రమానికి తలపెట్టిన ఆదిపురుష్ టీం కి ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు మరియు ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.ఈరోజు సాయంత్రం రిలీజ్ ట్రైలర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారు. దీనికి ఏ రేంజ్ రెస్పాన్స్ రాబోతుందో చూడాలి.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: An empty seat in theaters should be reserved for hanuman in every show of adipurush movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com