Homeఎడ్యుకేషన్838 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

838 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పాయి. 838 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేశాయి. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా జులై 27 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఎంబీబీఎస్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పరీక్ష కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ సంవత్సరం ఫైనలియర్ పరీక్షలు రాయాల్సి ఉన్న అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.upsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఎంబీబీఎస్ పాస్ కావడంతో పాటు ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి.

2021 ఆగస్టు 1 నాటికి 32 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మహిళ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.

ఇతరులకు మాత్రం 200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంది. 2021 సంవత్సరం నవంబర్ 21వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు పరీక్ష జరగనుందని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు త్వరగా ధరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular