Homeఎడ్యుకేషన్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అనుభవం ఉన్న ఉద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఫార్మ్‌ డి) ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రాజెక్ట్‌ ల్యాబొరేటరీ అటెండెంట్ – 01, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఫిజియాలజీ) ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

హైదరాబాద్ క్యాంపస్ లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఫార్మ్‌డీ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంది.

డైరెక్టర్‌, ఐసీఎంఆర్‌-నిన్‌, తార్నాక, హైదరాబాద్‌ – 500007 అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు తుది ఎంపిక జరగనుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు వేతనం లభించనుంది.

2022 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.nin.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

1 COMMENT

  1. […] AP government: ఏపీలోని వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని ఈ సందర్భంగా ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇటీవల ఏపీ సర్కారు ఇచ్చిన పీఆర్సీ వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్తున్నారు. కాగా, పీఆర్సీ వలన ఉద్యోగులకు లాభమే జరిగిందని ఏపీ అధికార పార్టీ వైసీపీ రిలీజ్ చేసిన లేఖను తప్పుబడుతున్నారు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు, టీచర్లు. తమకు జరిగే నష్టాల గురించి ఏ వేదికపైనైనా వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular