ఇండియన్ నేవీ నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ నేవీ ఈ నోటిఫికేషన్ ద్వారా సెయిలర్ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. సీనియర్ సెకండరీ రిక్రూట్ (ఎస్ఎస్ఆర్), ఆర్టిఫిసర్ అప్రెంటిస్ (ఏఏ) ఉద్యోగ ఖాళీలను ఇండియన్ నేవీ భర్తీ చేయనుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వారికి ట్రైనింగ్ సమయంలో 14,600 రూపాయల స్టైఫండ్ లభిస్తుంది.
మొత్తం 2700 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల కాగా పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి అర్హులు. త్వరలోనే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది . ఈ నెల 26వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండటం గమనార్హం. 60 మార్కులతో ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నిర్ణీత ప్రమాణాల ప్రకారం శరీరధారుడ్యం కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 100 మార్కులకు హిందీ, ఇంగ్లిష్లో రాతపరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఈ ఉద్యోగాలకు 215 రూపాయలు దరఖాస్తు ఫీజు కాగా ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు.
2021 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Indian navy ssr aa recruitment 2021 apply online for sailor posts from april 26
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com