
2021 – 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలోని గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం తాజాగా నోటిఫికేషన్ రిలీజైంది. 38 సాధారణ, 12 మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కొరకు ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. సంస్థ కార్యదర్శి ఎంఆర్ ప్రసన్న కుమార్ జారీ చేసిన ఈ ఉత్తర్వుల ద్వారా విద్యార్థులు 5వ తరగతిలో ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా జూన్ నెల 30వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. https://aprs.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేయడం జరుగుతుంది.
2010 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య పుట్టిన ఓసీ, బీసీ లకు చెందిన విద్యార్థులు, 2008 సెప్టెంబర్ 1 నుంచి 2012 ఆగస్టు 31 మధ్య పుట్టి ఎస్సీ, ఎస్టీ లకు చెందిన విద్యార్థులు 5వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2019 – 20, 2020 – 21 విద్యాసంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లలో 3, 4 తరగతులు చదివిన విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్థుల తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం లక్ష రూపాయల లోపు ఉన్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లోనే చదవాల్సి ఉండగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చదివినా గురుకులాల్లో ప్రవేశానికి అర్హులే.