సినిమా నటీమణుల బతుకులు ఎంత బాధాకరమైనవో ఇప్పటికే ఎంతోమంది చెప్పుకుని కుమిలిపోయారు. ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యంగ్ బ్యూటీ తేజశ్వి సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన కమిట్ మెంట్లు గురించి బయటపెట్టి.. అందరికీ షాక్ ఇచ్చింది. తన సినీ కెరీర్ లో చాల ఇబ్బందులు పడ్డాను అని చెప్పుకొచ్చింది.
ఈ బ్యూటీ తెలుగు అమ్మాయినే. అయితే వ్యవహారంలో మాత్రం తెలుగు తనం ఉండదు లేండి. పాప సాత్వికం అయినా, వెరీ బోల్డ్ బ్యూటీ. బూతులు మాట్లాడటంలో ఓ రేంజ్ లో ఆరితేరిపోయింది. మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ వేసే సమయంలో ఎంతో పద్దతిగా ఉండే తేజస్వి, సినిమా ఇండస్ట్రీలో తగిలిన దెబ్బలు కారణంగా తాను ఇలా బోల్డ్ గా మారిపోయాను అని చెబుతుంది.
తేజస్వి త్వరలోనే తీర్ధయాత్రకు వెళ్తుందట. కరోనా సెకెండ్ వేవ్ లాక్ డౌన్ తీసిన తరువాత, ఈ బ్యూటీ టూర్ ప్లాన్ చేస్తోంది. గతంలో కూడా తనను తానూ మార్చుకోవడానికి తీర్థయాత్రకు వెళ్లానని ఈ భామ చెప్పుకొచ్చింది. మనసు బాగోలేనప్పుడు తేజస్వి ఒంటరిగా ఎక్కడికో వెళ్తుందట. మరి ఎక్కడికి వెళ్తుందో చెప్పలేదు గానీ, మొత్తానికి ఈ బోల్డ్ భామ ఏమి చేసినా విచ్చలవిడిగానే ఉంటుంది.
అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో తనను కమిట్ మెంట్ ఇవ్వమని దాదాపు వంద మంది అడిగారని చెప్పి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నిజానికి తేజస్వి చేసిన సినిమాలే అన్ని కలిపి ఏభై లేవు. అంటే.. చేసిన ప్రతి సినిమా టీమ్ లో తేజస్విని ఇద్దరు కమిట్ మెంట్ అడిగినట్టు లెక్క. అన్నట్టు జీవితంలో ఇక పెళ్లి చేసుకోనంటోంది హీరోయిన్ తేజశ్వి. కానీ, బాయ్ ఫ్రెండ్ ను మాత్రం మెయింటైన్ చేస్తానంటోంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Beauty fell in love with the pilgrimage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com