spot_img
Homeబిజినెస్Most Valuable Companies in India: భారత్‌లో అత్యంత విలువైన కంపెనీలు ఇవే..

Most Valuable Companies in India: భారత్‌లో అత్యంత విలువైన కంపెనీలు ఇవే..

Most Valuable Companies in India: భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రైవేటు పెట్టుబడులు మన దేశంలోకి వెల్లువెత్తుతున్నాయి. భారత్‌లోని నిపుణులైన ఉద్యోగులను నియమించుకుని వేగంగా ఎదుగుతున్నాయి. భారతీయ యువశక్తి అనేక సంస్థల ఆర్థిక ఎదుగుదలతోపాటు దేశ ఆర్థిక ఎదుగుదలకు దోహదపడుతోంది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా దేశంలోని అత్యంత విలువైన కంపెనీలు దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దేశంలోని టాప్‌–10 కంపెనీల మార్కెట్‌ విలువలను, వాటి ప్రభావం, ఆర్థిక రంగంలో వాటి పాత్ర ఎలా ఉందో తెలుసుకుందాం.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌..
రిలయన్స్‌ ఇండస్ట్రీస్, రూ.19.30 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోంది. ఇది ఇంధనం, టెలికాం, రిటైల్, డిజిటల్‌ సేవలలో విస్తృతమైన వ్యాపార ఆసక్తులను కలిగి ఉంది. రిలయన్స్‌ జియో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది, అలాగే రిటైల్‌ విభాగంలో అంతర్జాతీయ బ్రాండ్‌లతో భాగస్వామ్యం ద్వారా దేశీయ మార్కెట్‌ను బలోపేతం చేసింది. రిలయన్స్‌ యొక్క వైవిధ్యభరిత వ్యాపార విధానం దాని ఆర్థిక స్థిరత్వాన్ని, మార్కెట్‌ ఆధిపత్యాన్ని నిర్ధారిస్తుంది. పునర్వినియోగ ఇంధనం, డిజిటల్‌ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు దీర్ఘకాలిక వృద్ధిని సూచిస్తున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.15.34 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో రెండో స్థానంలో ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకు. రిటైల్, కార్పొరేట్‌ బ్యాంకింగ్‌లో బలమైన ఉనికిని కలిగి ఉంది. 2023లో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో విలీనం దాని మార్కెట్‌ విలువను మరింత పెంచింది. విస్తృతమైన బ్రాంచ్‌ నెట్‌వర్క్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవలు దాని పోటీతత్వాన్ని పెంచుతాయి. ఇటీవల మార్కెట్‌ విలువలో రూ.19,284.8 కోట్ల నష్టం ఎదురైనప్పటికీ, దీర్ఘకాలిక స్థిరత్వం ఉంది.

భారతీ ఎయిర్‌టెల్‌..
భారతీ ఎయిర్‌టెల్‌ రూ.11.44 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో ఇటీవల టీసీఎస్‌ను అధిగమించి మూడో స్థానాన్ని సంపాదించింది. ఇది 18 దేశాలలో మొబైల్, బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్, సేవలను అందిస్తోంది. గూగుల్‌ ఆల్ఫాబెట్‌తో భాగస్వామ్యం ద్వారా గ్రామీణ భారతదేశంలో హై–స్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తోంది. బలమైన నెట్‌వర్క్‌ , విస్తృత కస్టమర్‌ బేస్‌ దాని మార్కెట్‌ విలువను పెంచాయి. లేజర్‌ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్‌ సేవల విస్తరణ భవిష్యత్తు వృద్ధిని సూచిస్తుంది.

టీసీఎస్‌..
టీసీఎస్‌ రూ.11.42 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో నాలుగో స్థానంలో ఉంది. ఇది గ్లోబల్‌ ఐటీ సేవలలో అగ్రగామిగా, 46 దేశాలలో డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సేవలను అందిస్తుంది. ఇటీవల భారతీ ఎయిర్టెల్‌ చేత మూడో స్థానం కోల్పోయినప్పటికీ, స్థిరమైన వృద్ధి దాని ఆర్థిక బలాన్ని ప్రతిబింబిస్తుంది. క్లౌడ్‌ కంప్యూటింగ్, ఏఐ, సైబర్‌ సెక్యూరిటీలో ఆవిష్కరణలు టీసీఎస్‌ బలాన్ని పెంచాయి. ఇటీవలి వారంలో రూ.8,032.15 కోట్ల మార్కెట్‌ విలువ నష్టపోయింది.

ఐసీఐసీఐ బ్యాంకు..
ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.10.29 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌తో ఐదో స్థానంలో ఉంది. ఇది రిటైల్, కార్పొరేట్, ఎన్‌ఆర్‌ఐ బ్యాంకింగ్‌ సేవలను అందిస్తుంది, డిజిటల్‌ బ్యాంకింగ్‌లో ఆవిష్కరణలతో ముందుంది. 6,587 బ్రాంచ్‌లతో విస్తృత నెట్‌వర్క్, కస్టమర్‌–సెంట్రిక్‌ విధానం బ్యాంకు విజయంలో భాగం. ఇటీవల రూ.13,566.92 కోట్ల మార్కెట్‌ విలువ నష్టపోయింది.

Also Read: టాటా పరువు తీస్తున్న టాప్ కంపెనీ.. రెండ్రోజుల్లో రెండు ప్రమాదాలు

ఎస్‌బీఐ..
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రూ.7.24 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో ఆరో స్థానంలో ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంక్‌గా, 22,542 బ్రాంచ్‌లతో అపారమైన నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. రిటైల్, కార్పొరేట్‌ బ్యాంకింగ్‌లో బలమైన ఉనికి ఉంది. ఇటీవల రూ.5,756.38 కోట్ల మార్కెట్‌ విలువ పెరుగుదల ఎస్‌బీఐని మరింత బలోపేతం చేసింది.

ఇన్ఫోసిస్‌..
ఇన్ఫోసిస్, రూ.6.81 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో ఏడో స్థానంలో ఉంది. ఇది 50 దేశాలలో డిజిటల్‌ సేవలు, కన్సల్టింగ్‌ను అందిస్తూ ఐటీ రంగంలో గ్లోబల్‌ లీడర్‌గా నిలుస్తోంది. ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో పెట్టుబడులు ఇన్‌ఫోసిస్‌ బలం. ఇటీవల మార్కెట్‌ విలువ రూ.13,127.51 కు పెరిగింది.

ఎల్‌ఐసీ..
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ), రూ.5.95 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థగా, 59% మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. విస్తృతమైన బీమా ఉత్పత్తులు, పెట్టుబడి సేవలతో ఆకట్టుకుంటోంది. ఇటీవల మార్కెట్‌ విలువ రూ.10,246.49 కోట్ల నష్టం చూసింది.

బజాజ్‌ ఫైనాన్స్‌..
బజాజ్‌ ఫైనాన్స్, రూ.5.74 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇది కన్సూ్యమర్‌ ఫైనాన్స్, ఎస్‌ఎంఈ ఫైనాన్స్, కమర్షియల్‌ లెండింగ్‌లో బలమైన ఉనికిని కలిగి ఉంది. డిజిటల్‌ సేవలలో ఆవిష్కరణలు, విస్తృత కస్టమర్‌ బేస్‌ ఉంది. ఇటీవల రూ.13,236.44 కోట్ల మార్కెట్‌ విలువ తగ్గుదల నమోదైంది.

హిందూస్థాన్‌ యునిలీవర్‌..
హిందూస్థాన్‌ యునిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) రూ.5.49 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో పదో స్థానంలో ఉంది. ఇది డవ్, లక్స్, లిప్టన్‌ వంటి బ్రాండ్‌లతో ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. బలమైన బ్రాండ్‌ పోర్ట్‌ఫోలియో, విస్తృత కస్టమర్‌ బేస్‌ ఈ సంస్థ బలం. ఇటీవల రూ.7,906.37 కోట్ల మార్కెట్‌ విలువ పెరుగుదల నమోదైంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular