spot_img
Homeబిజినెస్Tata EV Car: కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్... పెట్రోల్ అవసరం...

Tata EV Car: కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్… పెట్రోల్ అవసరం లేదు

Tata EV Car: ప్రతి రంగంలో ఇప్పుడు AI చొచ్చుకుపోతుంది. ఆటోమోబైల్ రంగంలోకి కూడా ఏఐ ఎంట్రీ ఇచ్చింది. ఆకర్షణీయంగా ఉండే కార్లలో ఏఐ ఆధారిత ఫీచర్లు తీసుకువచ్చి వినియోగదారులను ఇంప్రెస్ చేస్తున్నారు. అలాగే ఇప్పటి వారికి అనుగుణంగా సమయం వృధా కాకుండా తొందరగా చార్జింగ్ అయ్యే బ్యాటరీని అమరుస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఫీచర్లు కరిగిన Tata కంపెనీ కారు ఇప్పుడు రూపుదిద్దుకుంటుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ కారు త్వరలో మార్కెట్లోకి వచ్చి అలజడి సృష్టించే అవకాశం ఉంది. మరి ముందుగానే దీని ఫీచర్స్ గురించి తెలుసుకుందామా..

కొత్తగా కారు కొనాలని అనుకునేవారు ఇప్పుడు ఎలక్ట్రిక్ మోడల్స్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. వీరికి అనుగుణంగా కంపెనీలు సైతం లేటెస్ట్ టెక్నాలజీతో EVలను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. అయితే Tata కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ 2025 మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. అయితే ఇందులో ఇప్పటివరకు వచ్చిన కార్ల కంటే భిన్నమైన ఫీచర్లు ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇందులో డిసి చార్జర్లను ఉపయోగించనున్నారు. ఇవి 45 నిమిషాల్లో బ్యాటరీని 10 నుంచి 80% వరకు చార్జింగ్ అయ్యే విధంగా చేస్తాయి.. అలాగే హోమ్ చార్జింగ్ అయితే ఐదు నుంచి ఆరు గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఇందులో రెండు రకాల చార్జర్ లు ఉండడంతో వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు పెరిగిపోతుండడంతో ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

ఈ కారులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది AI స్మార్ట్ డాష్ బోర్డు. ఇది AI ఆధారితంగా ఉండడంతో నేటి కాలం వారికి డ్రైవింగ్ అనుభూతి అద్భుతంగా ఉంటుంది. ఈ వ్యవస్థ వాయిస్ కమాండ్, ప్రేడిక్టివ్ నావిగేషన్, బ్యాటరీ హెల్త్ వంటి విషయాలను ఎప్పటికప్పుడు అలాంటి చేస్తుంది. ఇందులో డిజిటల్ కాకపీట్ అనుభవాన్ని కూడా పొందవచ్చు. హై సెగ్మెంట్ కారులో మాత్రమే కనిపించే ఈ డాష్ బోర్డు ఇందులో ఉండడం తో ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఇందులో ఇంటీరియర్ ఫీచర్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాక్టరీ ఫిట్ సన్ రూప్, విశాలమైన క్యాబిన్ సౌకర్యాన్ని కలిగిస్తుంది. ఒక హ్యాచ్ బ్యాక్ కారు SUV లా అనుభూతిని ఇస్తుంది.

ఈ కారు కాంపాక్ట్ మోడల్ అయినప్పటికీ ఇందులో భద్రత పటిష్టంగానే ఉంటుంది. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ తో పాటు EBD తో కూడిన ABS, రియర్ పార్కింగ్, రీ జనరేటివ్ బ్రేకింగ్ సిస్టం వంటివి ఉన్నాయి. ఈ కారును మార్కెట్లోకి తీసుకువచ్చి రూ.4.5 లక్షల ప్రారంభ ధర నుంచి.6 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉంది. భారతదేశంలో వచ్చే ఏడాదిలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాబోయే ఈవిల్లో ఇదే బెస్ట్ మోడల్ అయ్యే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు భావిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Oktelugu Epaper