Homeబిజినెస్SBI Bank New Services: డబ్బు డిపాజిట్ చేస్తున్నప్పుడు మధ్యలో నిలిచిపోయిందా.. ఏం చేయాలంటే?

SBI Bank New Services: డబ్బు డిపాజిట్ చేస్తున్నప్పుడు మధ్యలో నిలిచిపోయిందా.. ఏం చేయాలంటే?

SBI Bank New ServicesSBI Bank New Services: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 44 కోట్లకు పైగా కస్టమర్లను కలిగి ఉంది. కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా ఎస్బీఐ ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తుండటం గమనార్హం. దేశంలో ఎక్కువ సంఖ్యలో ఏటీఎంలు ఉన్న బ్యాంకుగా ఎస్బీఐకి పేరుంది. ఏటీఎం ద్వారా డబ్బులను విత్ డ్రా చేసుకోవడంతో పాటు క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా నగదును డిపాజిట్ చేయవచ్చు.

అయితే కొన్నిసార్లు వేర్వేరు కారణాల వల్ల నగదు డిపాజిట్ చేసే సమయంలో పని మధ్యలోనే నిలిచిపోతుంది. నగదు డిపాజిట్ మెషిన్ లో నగదు జమ చేసినా అవతలి వ్యక్తి ఖాతాలో నగదు జమ కాకపోవడం వల్ల ఇబ్బందులు పడేవాళ్లు చాలామంది ఉంటారు. ఇలాంటి సమస్య ఎదురైతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డబ్బును సులభంగా తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.

తాజాగా ఒక కస్టమర్ కు ఇలాంటి అనుభవం ఎదురు కాగా కస్టమర్ ట్విట్టర్ ద్వారా ఎస్బీఐకి ఫిర్యాదు చేశారు. ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ లో ఫిర్యాదు చేయవచ్చని 1800 11 2211, 1800 425 3800, 080 -26599990 నంబర్ల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సులభంగా ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే ఉంటాయని తెలుస్తోంది.

ఈ విధంగా ఫిర్యాదు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకుని డబ్బులను పొందవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని బ్రాంచ్ మేనేజర్ ను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. డబ్బులు జమ కాకపోయినంత మాత్రాన ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular