పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బద్రి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరీ జగన్నాథ్. మొదటి చిత్రంతోనే తాను ‘అదోరకం’ అని చాటి చెప్పిన పూరీ.. ఆ తర్వాత అదే తీరును కంటిన్యూ చేశాడు. ఆ విధంగా స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీ సంపాదించుకున్నాడీ దర్శకుడు. ప్రస్తుతం ‘లైగర్’తో బిజీగా ఉన్న పూరీ.. తర్వాత పవన్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: శంకర్-చెర్రీ బడ్జెట్ అంతనా..! హీరోయిన్ ఎవరో తెలుసా..?
పవన్ – పూరీది క్రేజీ కాంబో కావడం ఒక కారణమైతే.. గతంలో పూరీ చేసిన వ్యాఖ్యలు కూడా మరోకారణం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం తర్వాత.. ఇక, తాను పవన్ తో సినిమాలు తీయను అని ప్రకటించాడు పవన్. అప్పట్లో ఈ కామెంట్స్ సంచలనం రేకెత్తించాయి. అలాంటిది ఇప్పుడు పవన్ తో పూరీ సినిమా అనే వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారాయి.
వీళ్లిద్దరినీ బండ్ల గణేష్ కలపబోతున్నారని టాక్. పవన్ తో సినిమా చేయాలని బండ్ల చాలా కాలంగా చూస్తున్నారు. మరోసారి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశపడుతున్నాడు. దీనికి పవన్ కూడా ఓకే అన్నారని తెలుస్తోంది. దాదాపు నాలుగు నెలలుగా పవన్ వెంట తిరుగుతున్నాడు బండ్ల. అయితే.. డైరెక్టర్ గా ఎవరిని ఎంచుకోవాలన్నదే సమస్యగా మారిందట.
Also Read: టీజర్ టాక్: లవర్ ఆనందం కోసం ‘పాగల్’ అయ్యాడు
ప్రధాన దర్శకులు అందరూ.. వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే.. తాజాగా పూరి విషయం డిస్కషన్ లోకి వచ్చిందని టాక్. పూరితో బండ్ల రిలేషన్ చాలా బాగుందన్న సంగతి తెలిసిందే. ‘ఇద్దరు అమ్మాయిలతో’ సినిమా టైంలో ఖరీదైన లైటర్ ను పూరీకి గిఫ్ట్ గా ఇచ్చాడు బండ్ల. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ‘టెంపర్’ సినిమా రూపొందించారు.
ఈ నేపథ్యంలో వీరి కాంబోలో మళ్లీ సినిమా రాబోతోందనే చర్చ సాగుతోంది. ఇటు పవన్ బండ్లకు సన్నిహితుడు, అటు పూరీ కూడా ఆప్తుడే. కాబట్టి.. ఇద్దరినీ గణేష్ ఒప్పించబోతున్నాడని టాక్. మరి ఏం జరుగుతుంది..? పవన్-పూరీ కాంబోలో సినిమా వస్తుందా? లేదా? అన్నది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్