
అక్రమంగా ప్రవేశించిన వారిపై కేసులు పెట్టకుండా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబంపై కేసులు పెట్టడం ఏంటి? అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవస్థలు ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్లిపోయాయని ధ్వజమెత్తారు. కలెక్టర్, ఎస్పీలు బలహీనులు అయిపోయారని ఆరోపించారు. ప్రశ్నించినవారిపై దాడులకు పాల్పడుతున్నారని సోమిరెడ్డి ఆక్షేపించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనపై జేసీ ప్రభాకర్రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.