
రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈనెల 25న 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలన్నారు. అదే రోజు 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులతో పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాలు పంపిణీ, నిర్మాణంపై సమావేశంలో చర్చించారు.