గతంలో ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి పదోతరగతి మార్కులు ప్రామాణికంగా తీసుకుని జాయిన్ చేసుకునేవారు. ఈ ఏడాది పదోతరగతి విద్యార్థులందరూ పాసయిన నేపథ్యంలో ప్రత్యేక పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ట్రిపుల్ ఐటీలో సీటు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.