ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ తూర్పులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఇక్కడ 144 సెక్షన్ విధించారు. ఇటీవల అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆదివారం ఎమ్మెల్యే వెలగపూడి సాయిబాబా ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. దీంతో వైసీపీ శ్రేణులతో సాయిబాబా ఆలయానికి ఎమ్మెల్యే అమర్నాథ్ చేరుకున్నారు. అయితే అక్కడికి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రాకపోవడంతో వెనుదిరిగారు. ఈ సమయంలో టీడీపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈనేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.