బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఆమె వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా ఆమెనే చాలా మంది బీజేపీ నాయకులు కలిశారు. విషయం తెలియగా కొందరు కరోనా పరీక్షలు చేరయించుకుంటున్నారు. అటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో బీజేపీలో ఆందోళన మొదలైంది.
Also Read: బుద్ది తక్కువై పవన్ ను నమ్మాం.. పవన్ మూడు పెళ్లిళ్ల మాసికం: నారాయణ