Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress Party: వైసీపీకి ఆ సీనియర్ నేత గుడ్ బై!

YSR Congress Party: వైసీపీకి ఆ సీనియర్ నేత గుడ్ బై!

YSR Congress Party: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కుటుంబాలు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అటువంటి వారంతా పార్టీని వీడలేక.. ఉండలేక సతమతం అవుతున్నారు. జగన్ సీరియస్ రాజకీయాలు చేయకపోవడం, మళ్లీ అధికారం తనదేనని ధీమా వ్యక్తం చేస్తుండడం, అందుకు ఎటువంటి కృషి చేయకపోవడంతో సీనియర్లు చేతులెత్తేస్తున్నారు. ఇక పార్టీలో ఉండలేమని తేల్చి చెబుతున్నారు. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి […]

YSR Congress Party: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కుటుంబాలు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అటువంటి వారంతా పార్టీని వీడలేక.. ఉండలేక సతమతం అవుతున్నారు. జగన్ సీరియస్ రాజకీయాలు చేయకపోవడం, మళ్లీ అధికారం తనదేనని ధీమా వ్యక్తం చేస్తుండడం, అందుకు ఎటువంటి కృషి చేయకపోవడంతో సీనియర్లు చేతులెత్తేస్తున్నారు. ఇక పార్టీలో ఉండలేమని తేల్చి చెబుతున్నారు. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. టిడిపిలో చేరికకు రంగం సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది. చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

* కాంగ్రెస్ ను విభేదించి..
కాంగ్రెస్ పార్టీని విభేదించి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో చాలా కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డిని అనుసరించింది. రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్నారు మేకపాటి. అయితే మేకపాటి ఫ్యామిలీకి క్రమేపి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని మేకపాటి ఫ్యామిలీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతానని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ జగన్ మోహన్ రెడ్డి వైపు ఎటువంటి బుజ్జగింపులు లేవు. అదే సమయంలో టిడిపి నుంచి సానుకూలత రావడంతో మేకపాటి ఫ్యామిలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేందుకు దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

* పట్టున్న నేత..
ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మేకపాటి ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగించేవారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఎంపీగా సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయంగా ఆయనది చెరగని ముద్ర. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆయన అకాల మృతితో మరో కుమారుడు విక్రమ్ రంగంలోకి దిగారు. ఒకసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి తో పాటు విక్రమ్ రెడ్డి సైతం పోటీ చేశారు. కానీ ఇద్దరు ఓడిపోయారు. మేకపాటి గౌతంరెడ్డి మరణం తర్వాత ఆ ఫ్యామిలీకి రాజకీయంగా ప్రాధాన్యత తగ్గిపోయింది. ప్రస్తుతం మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారులు వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు.

* ఆ కారణంతోనే..
జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పటికీ ఆ జూనియర్లను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం మింగుడు పడడం లేదు సీనియర్లకు. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తీరు మారాలని ఎక్కువగా కోరుకున్నారు. కానీ ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. అందుకే తన దారి తాను చూసుకోవాలని భావిస్తున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీలోకి వస్తానంటే కచ్చితంగా ఆహ్వానం పలుకుతామని చంద్రబాబు నుంచి సమాచారం రావడంతో తీవ్ర నిర్ణయం దిశగా మేకపాటి రాజమోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఆ ప్రచారంలో నిజం ఎంత ఉందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper