Homeఆంధ్రప్రదేశ్‌Sri Reddy: పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్.. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వైసిపి.....

Sri Reddy: పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి షాకింగ్ పోస్ట్.. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వైసిపి.. జనసేన స్ట్రాంగ్ రియాక్షన్

Sri Reddy: నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసేవారు. వైసీపీ అధికారంలో ఉండడంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాస్త తగ్గినట్టు కనిపించారు. వైసిపి పై తిరుగుబాటు వ్యాఖ్యలు చేశారు. వైసిపి నేతల తీరును కూడా తప్పుపట్టారు. అయితే ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు మొదలుపెట్టారు. ఒక వీడియోను పోస్ట్ చేసి పవన్ ను టార్గెట్ చేశారు. దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న వేళ పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ గురించి చెప్పిన మాటల తాలూకా ఒక పోస్ట్ పెట్టిన శ్రీరెడ్డి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. పూర్తిగా ఎడిట్ చేయించి ఆ వీడియోను షేర్ చేశారు. ఇక ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ మన ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కరు ఎన్నో త్యాగాలు చేశారని.. భగత్ సింగ్ చరిత్ర చదివితే 23 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని వ్యాఖ్యానించారు. ఈ వీడియోని పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ మాటలకు ఓరి నీ దుంపలు తెగ మీరెక్కడ తయారయ్యారు రా బాబు అనే డైలాగులు కలిపి అనొథెర్ డైమండ్ ఫ్రొం డిప్యూటీ సీఎం అంటూ క్యాప్షన్ పెట్టి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

* భగత్ సింగ్ మృతి పై వివాదం
శ్రీ రెడ్డి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదు స్వామి.. ఆయనను ఉరేసారు అంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు. మరి కొంతమంది వైసీపీ అభిమానులైతే నేరుగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి మనకు డిప్యూటీ సీఎం అంటూ కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు. ఇదే నా పుస్తకాల నాలెడ్జ్ అంటూ మరికొందరు నిలదీస్తున్నారు.

* తగ్గిన రాజకీయ విమర్శలు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరెడ్డి రాజకీయ విమర్శలు తగ్గించారు. శ్రీ రెడ్డి ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియడం లేదు. వైసీపీ నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకొని ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. దానిని నిజం చేస్తూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమెకు చెల్లించాల్సిన నగదు వెళ్లకపోవడంతో వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం వైసిపి వైఫల్యాల పై కూడా ఆమె మాట్లాడారు.

* జన సైనికులు ఆగ్రహం
అయితే శ్రీరెడ్డి తీరుపై జనసైనికులు మండిపడుతున్నారు. ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వైసీపీకి చేతకాకపోవడంతోనే అటువంటి మహిళతో విమర్శలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు వివాహేతర సంబంధాల్లో మునిగిపోయారని.. ఆ వివాదాల్లో చిక్కుకోవడంతో వైసీపీకి అప్రతిష్ట ఏర్పడిందని.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే శ్రీ రెడ్డి లాంటి మహిళతో ఆరోపణలు చేయిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular