spot_img
Homeఆంధ్రప్రదేశ్‌New Ration Cards: ఏపీలో జనవరికి కొత్త రేషన్ కార్డులు.. పాతవి రద్దు.. అర్హతలు ఇవే

New Ration Cards: ఏపీలో జనవరికి కొత్త రేషన్ కార్డులు.. పాతవి రద్దు.. అర్హతలు ఇవే

New Ration Cards: టిడిపి కూటమి ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది. కొత్త రేషన్ కార్డుల మంజూరు పై అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.అర్హతలను సైతం ఖరారు చేసింది. పాత రేషన్ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తవి జారీ చేయనుంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో రేషన్ కార్డు ప్రాతిపదికగా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అర్హతల విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల మంజూరు పై ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అర్హత కలిగిన వారికి కొత్త కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. కొత్తగా వివాహం చేసుకున్న జంటలతో పాటుగా ప్రభుత్వ నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా.. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రీ డిజైన్ చేసి అందించనున్నారు. అంటే రేషన్ కార్డు రంగు, ముద్ర మారనందన్నమాట. అయితే ఈ విషయంలో ప్రభుత్వం పై భారం పడకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

* మారనున్న రంగు
సాధారణంగా ప్రభుత్వం మారిన ప్రతిసారి రేషన్ కార్డుల పై రంగు మారడం పరిపాటిగా ఉంది. ఇప్పటికే లేత పసుపు రంగు కార్డు పై రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని ముద్రించిన నమూనాను ప్రభుత్వ ఆమోదానికి పంపారు. గత ప్రభుత్వంలో కొత్త కార్డుల కోసం 30,611 దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు సభ్యుల చేర్పుల కోసం రెండు లక్షల పదమూడు వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో తొలగింపు కోసం 36,588 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అడ్రస్ మార్పు కోసం 8263 దరఖాస్తులు వచ్చాయి.ఇక కార్డు సరెండర్ కోసం వచ్చినవి 685. మొత్తం మూడు లక్షల 36 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

* అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ..
ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిల్లో 90 లక్షల కార్డులను జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించారు. వీటికి ఉచిత బియ్యం, కందిపప్పు,పంచదార తదితర సరుకులు అందుతున్నాయి. మిగిలిన కార్డులకు ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు,పంచదార,జొన్నలు, రాగులు తదితర సరుకులు అందుతున్నాయి.వీటిపై ఇస్తున్న సబ్సిడీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అందుకే తాజాగా రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. అదనపు భారం పడకుండా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper