spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Mynampally Hanumantha Rao: T News కార్యాలయం నేలమట్టం.. డేట్ ఫిక్స్ చేసిన కాంగ్రెస్..

Mynampally Hanumantha Rao: T News కార్యాలయం నేలమట్టం.. డేట్ ఫిక్స్ చేసిన కాంగ్రెస్..

Mynampally Hanumantha Rao: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్నికల వాతావరణం లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు అధికారపక్షం వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టుగా తెలంగాణలో పరిస్థితి నెలకొంది.

ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకులపై గులాబీ పార్టీ అనుకూల మీడియా ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తోంది. కొన్ని సందర్భాలలో వ్యతిరేక కథనాలు శృతి మించుతున్నాయి. ప్రభుత్వం ఏం చేసినా సరే తప్పు అనేటట్టుగా గులాబీ పార్టీ మీడియా, సోషల్ మీడియా వ్యవహరిస్తున్నాయి.

సహజంగానే తన మీద వ్యతిరేకంగా వచ్చే కథనాలను ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా సహించలేడు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మినహాయింపు కాదు. అయితే ఇటీవల టీ న్యూస్, మిర్రర్ అనే యూట్యూబ్ ఛానల్లో తమ మీద ఇష్టానుసారంగా వ్యతిరేక కథనాలను ప్రసారం చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ఒక అడుగు ముందుకు వేశారు. అదే కాదు గాంధీభవన్ వెళ్లి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వ్యతిరేకంగా టీ న్యూస్, మిర్రర్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ లో ప్రసారమైన వ్యతిరేక కథనాలను ఆయన ప్రస్తావించారు. అంతేకాదు, తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

తన పార్టీ నాయకుల మీద వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తున్న టీ న్యూస్ కార్యాలయాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. కేటీఆర్ మీద వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తే మహా టీవీ న్యూస్ ఛానల్ కార్యాలయం మీద దాడులు చేశారని.. ఇప్పుడు టీ న్యూస్ తన మీద వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తోందని.. అందువల్ల లక్ష మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో వెళ్లి టీ న్యూస్ కార్యాలయాన్ని నేలమట్టం చేస్తామని మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. “టీ న్యూస్ ఛానల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తీవ్రస్థాయిలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తున్నారు. మమ్మల్ని తొక్కుతామంటూ బెదిరిస్తున్నారు. ఆ వీడియోలను పదేపదే ప్లే చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారి మీద ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తున్నారు. మా మీద వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తున్న టీ న్యూస్ కార్యాలయం పైకి లక్ష మంది కాంగ్రెస్ కార్యకర్తలతో వెళ్తాం. ఉదయం మొదలుపెడితే సాయంత్రం వరకు టీ న్యూస్ కార్యాలయం నేలమట్టమవుతుందని” మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య ఈ ఇద్దరు లేకుండా సినిమా చేయడం లేదుగా…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. రీసెంట్ గా ఆయన చేసిన 'అఖండ 2' సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన...
YSR Congress Party

YSR Congress: గోదావరి జిల్లాలో వైసీపీకి షాక్!

YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి సీనియర్ నేత ఒకరు గుడ్ బై చెప్పారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేస్తున్న అతనిని కాదని వేరే వ్యక్తికి ప్రాధాన్యం...
YS Jagan

YS Jagan: జగన్ కు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్!

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పుంజుకునేందుకు ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. మరోవైపు పార్టీ నేతలకు కేసులు...
Tanuja

Tanuja: ‘అతని వల్లే ఈరోజు కళ్యాణ్ పడాల సేఫ్ గా ఉన్నాడు’ అంటూ ‘బిగ్ బాస్ 9’ ఫేమ్...

Tanuja: గత ఏడాది ప్రసారమైన 'బిగ్ బాస్ 9' షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయినటువంటి సీజన్స్ అన్నిటికంటే ఈ సీజన్ కే...
Andhra Pradesh Gold Mines

Andhra Pradesh Gold Mines: ఏపీకి బంగారం లాంటి వార్త!

Andhra Pradesh Gold Mines: జాతీయస్థాయిలో ఏపీ భరోసారీ ప్రత్యేక గుర్తింపు పొందింది.'గోల్డెన్' ఛాన్స్ దక్కించుకుంది.. రాయలసీమలో మరో జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్య వహిస్తున్న చిత్తూరులో...
Oktelugu Epaper