IAS Transfers: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం( AP government ) కీలక నిర్ణయం తీసుకుంది. 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సాధారణ బదిలీల్లో భాగంగా ఈ అధికారులకు స్థానచలనం కల్పించింది. గుంటూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులను మార్కాపురం జాయింట్ కలెక్టర్ గా నియమించింది. మార్కాపురం జేసీగా ఉన్న రోణంకి గోపాలకృష్ణను వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
* పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ గా శ్రీనివాస్ నపూర్ అజయ్ కుమార్ ను నియమించింది.
* ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా కల్పనా కుమారి నియమితులయ్యారు.
* గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా మయూర్ అశోక్ ను నియమించారు.
* అనకాపల్లి జెసిగా మల్లవరపు సూర్యతేజ నియమితులయ్యారు.
* చిత్తూరు జెసిగా ఆదర్శ రాజేంద్రన్ ను నియమించారు.
* గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎస్ఎస్ శోభిక నియమితులయ్యారు.
* కడప జాయింట్ కలెక్టర్ గా నిధి మీనాను నియమించారు.
* విశాఖ జాయింట్ కలెక్టర్గా గొబ్బిళ్ళ విద్యాధరి
* అన్నమయ్య జాయింట్ కలెక్టర్గా శివ నారాయణ శర్మ
* పల్నాడు జేసీగా సంజన సింహాన్ని నియమించారు.
* కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమితులైన నిధి మీనా.. ఆ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ భార్య కావడం విశేషం.