Homeఆంధ్రప్రదేశ్‌Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం: ఒక్కరు స్పందించినా.. 20 మంది ప్రాణాలు...

Kurnool Bus Fire Accident: కర్నూలు బస్సు ప్రమాదం: ఒక్కరు స్పందించినా.. 20 మంది ప్రాణాలు దక్కేవి..

Kurnool Bus Fire Accident: కర్నూలులో ఇటీవల చోటు చేసుకున్న బస్సు ప్రమాదానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత బైకర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఒక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన బృందాలు లోతుగా దర్యాప్తు చేస్తుంటే బస్సు డ్రైవర్, బైకర్ కాకుండా ప్రమాదానికి మరో కారణం కూడా వెలుగులోకి వచ్చింది.

Also Read: ప్రమాదపుటంచున ఏపీ.. దూసుకొస్తున్న ‘మొంథా’!

కర్నూలులో వేమూరి కావేరి సంస్థకు సంబంధించిన బస్సు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 20 మంది చూస్తుండగానే చనిపోయారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడం.. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో కొంతమంది బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. తమ ప్రాణాలు కాపాడుకునే క్రమంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నియమించిన అధికారుల బృందం లోతుగా దర్యాప్తు చేస్తోంది. అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ద్విచక్ర వాహనం నడిపిన శివశంకర్ ఆరోజు తెల్లవారుజామున 2:45 నిమిషాలకు డివైడర్ ను ఢీకొట్టాడు. అతడు మద్యం మత్తులో ఉండడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అతడు నడిపిన బండి రోడ్డు మధ్యలో పడింది. వేమూరి కావేరి సంస్థకు సంబంధించిన బస్సు అదే రోజు తెల్లవారుజామున రెండు గంటల 55 నిమిషాలకు ఆ బైకును ఢీ కొట్టింది. అయితే ఈ మధ్యలో దాదాపు 19 వాహనాలు రోడ్డు మీద పడి ఉన్న బైకును తప్పించుకుని వెళ్లాయి. ఎవరు కూడా ఆ బైకును పక్కకు జరపాలని అనుకోలేదు.

వాస్తవానికి రోడ్డు మధ్యలో బైక్ పడి ఉన్నప్పటికీ కావేరి ట్రావెల్స్ బస్సు తోలిన డ్రైవర్ కు అది కనిపించలేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ” ఆ ద్విచక్ర వాహనం నడిపిన వాడికి సోయి లేదు.. విపరీతంగా మద్యం తాగి వాహనం నడిపాడు. డివైడర్ ను ఢీ కొట్టి దుర్మరణం చెందాడు. కనీసం ఆ బైక్ ను పక్కకు జరపాలని ఎవరికీ అనిపించలేదు. దీంతో ఆ బైక్ రోడ్డు మధ్యలో అలానే ఉంది. చివరికి అది కావేరి ట్రావెల్స్ బస్సు తోలుతున్న డ్రైవర్ కు కూడా కనిపించలేదు. అంత పెద్ద బైక్ కనిపించలేదా? ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యంతో అలానే నడిపాడా? ఏది ఏమైనప్పటికీ బైకర్ నిర్లక్ష్యం.. బస్సు డ్రైవర్ ముర్కత్వం కలసి 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 20 మంది కుటుంబాలలో ఊహించని విషాదం ఏర్పడింది. వారు లేని లోటు ఎవరు తీర్చుతారు. వారి ప్రేమను ఎవరు అందిస్తారని” నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

సమాజంలో రోజురోజుకు సేవా తత్పరత అనేది లేకుండా పోతోంది. ఎవడు ఏమైపోతే నాకేంటి.. నా సెక్యూరిటీ నాకు ఉంటే సరిపోతుందని జనాలు అనుకుంటున్నారు. అందువల్లే ఎన్ని ప్రమాదాలు జరిగినా.. ఎన్ని ఘోరాలు చోటు చేసుకున్నా పట్టనట్టు ఉంటున్నారు. కర్నూలు ఘటన లో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు సమాజంలో చోటు చేసుకుంటున్న పెడ పోకడలకు దర్పణంగా నిలుస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper