spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan Quash Petition: వైసీపీలో టెన్షన్.. కోర్టుకు జగన్!

Jagan Quash Petition: వైసీపీలో టెన్షన్.. కోర్టుకు జగన్!

Jagan Quash Petition: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది హైకోర్టు. కొద్ది రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. వైసిపి కార్యకర్త సింగయ్య అనే వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే జగన్ కాన్వాయ్ ఢీకొని ఆయన మృతి చెందాడని పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. పోలీస్ విచారణకు హాజరుకావాలని జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో తన పై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ఈరోజు ఆ కేసు విచారణ జరగనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read: ABN Venkatakrishna Criticism Jagan: జగన్ ఐదు వారాల వ్రతాలు చేస్తున్నాడా? ఏబీఎన్ వెంకటకృష్ణ సూపర్ సిక్స్ అమలు పై ఇలానే మాట్లాడగలడా?

పోలీస్ ఆంక్షలు ఉన్నా సత్తెనపల్లి( Sattenapalli ) నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడి విగ్రహ ఆవిష్కరణకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఇంతకుముందు జగన్ జిల్లాల పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. దీంతో పోలీసులు కొంత ఆంక్షలు విధించారు. కాన్వాయ్ లో మూడు వాహనాలు ఉండేలా చూసుకోవాలని.. పరిమిత సంఖ్యలో జనాభాతో విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవాలని సూచించారు. కానీ జగన్మోహన్ రెడ్డి 50కు పైగా వాహనాలతో కాన్వాయిగా వెళ్లారు. దారి పొడవు నా భారీగా జన సమీకరణ జరిగింది. ఈ తరుణంలో సింగయ్య అనే వృద్ధుడు జగన్ కాన్వాయ్ ఢీకొని చనిపోయాడని ప్రచారం సాగింది. కానీ గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడంటూ గుంటూరు పోలీసులు ప్రకటించారు. కానీ ఇంతలో జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందపడి సింగయ్య మృతి చెందినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. వాటిని ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్లు మార్చి కేసు దర్యాప్తు ప్రారంభించారు. విచారణకు హాజరు కావాలంటూ జగన్మోహన్ రెడ్డికి నేరుగా నోటీసులు జారీ చేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి నిన్న అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

క్వాష్ పిటిషన్లు దాఖలు
అయితే ఈ కేసులో వాహన డ్రైవర్ రమణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆయన పిఏ నాగేశ్వర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజినిని నిందితులుగా చేర్చిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనిపై వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఏ పాపం తెలియదని.. రమణ నిర్దోషులుగా ప్రకటించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు( kwash petitions ) దాఖలు చేశారు. ఈరోజు ఈ పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తప్పకుండా ఈ కేసు విచారణపై స్టే ఇస్తుందన్న ఆశతో వారంతా ఉన్నారు. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Also Read: Jagan Active Politics: జగన్ ముందున్న ఆప్షన్ అదే

సోషల్ మీడియాలో వారు
మరోవైపు సింగయ్య( singaiya ) మృతి పై రకరకాల చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా కూటమి పార్టీలు వెర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ అన్నట్టు ఉంది. అది ఫేక్ వీడియో అని.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వీడియోను క్రియేట్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని అంతటా ఉత్కంఠ కొనసాగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper