Homeఆంధ్రప్రదేశ్‌YS Jagan: ఆ నలుగురితోనే జగన్ నిర్ణయాలు!

YS Jagan: ఆ నలుగురితోనే జగన్ నిర్ణయాలు!

YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు చాలామంది అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. ఎటువంటి సూచనలు, అభిప్రాయాలు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవడం పై ఎక్కువమంది అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నిర్ణయాల్లో కనీసం భాగస్వామ్యం కల్పించడం లేదు సీనియర్లకు. ఇప్పుడు కూడా ఆ నలుగురే అన్నట్టు పరిస్థితి ఉంది. ఇటీవల మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. దానిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అసలు రాజధాని విషయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది మొన్నటి ఎన్నికల్లో. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా.. పదే పదే దాని జోలికి వెళ్తూ అనవసరంగా పార్టీకి డ్యామేజ్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి పై సీనియర్లకు ఉన్న అభిప్రాయం. ఆపై కుల వివాదాలు కూడా ఆ పార్టీ నేతలను కలవరపరుస్తున్నాయి. ముఖ్యంగా హిందుత్వ వ్యతిరేక ముద్ర పార్టీపై పడుతోంది. ఇటీవల మతంపై, హిందూ దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడంతో సీనియర్లు ఒక్కసారిగా బయటకు వస్తున్నారు. ఇక ఉండలేం అని తేల్చి చెబుతున్నారు.

* రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు సైతం పనిచేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పై ఉన్న అభిమానం.. కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం కోల్పోవడం.. మరో ప్రత్యామ్నాయం లేకపోవడం.. తదితర కారణాలతో జగన్ వెంట ఉండిపోయారు. అటువంటి వారు చాలా బాధపడుతున్నారు ఇప్పుడు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కానీ దానిని అచేతనంగా ఉంచేశారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మాదిరిగా వైసీపీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఒక్కసారిగా కూడా ఆ కమిటీ సమావేశం అయిన దాఖలాలు లేవు. పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో సీనియర్లను కలవడం తప్ప.. ఎప్పటికప్పుడు పార్టీ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ అత్యున్నత కమిటీ సమావేశం కావడం లేదు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

* అత్యున్నత కమిటీ ఉన్న..
ప్రస్తుతం ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. సభ్యులుగా తమ్మినేని సీతారాం, ముద్రగడ పద్మనాభం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి సీనియర్లు 33 మంది వరకు ఉన్నారు. కానీ ఒక్క నిర్ణయంలో కూడా ఈ కమిటీ భాగస్వామ్యం లేదు. ఇప్పటికీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఒకరిద్దరూ తప్ప.. మిగతా వారికి అస్సలు విధానపరమైన నిర్ణయాలు అస్సలు చోటు లేదు. దీంతో సీనియర్లంతా రగిలిపోతున్నారు. అటువంటప్పుడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో.. జనసేన సైతం అత్యున్నత కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తోంది. ఆ రెండు పార్టీల అధినేతలు సీనియర్ల అభిప్రాయాలను గౌరవించి.. వారి అభిప్రాయాలకు పెద్ద పీట వేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ పరిస్థితి లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...
Kerala Innovation

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper