spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Volunteers: వాలంటీర్ వ్యవస్థ లేనట్టేనా?

AP Volunteers: వాలంటీర్ వ్యవస్థ లేనట్టేనా?

AP Volunteers: ఏపీలో అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా? కొనసాగించే ఉద్దేశం ఉందా? రాజీనామా చేయని వారిని కొనసాగిస్తారా? కొత్త వారిని తీసుకుంటారా? తీసుకుంటే ఏ మార్గదర్శకాలు పాటిస్తారు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే అసలు వాలంటీర్ వ్యవస్థ ఉండదని తెలుస్తోంది. పూర్తిగా భర్తీ చేసే అవకాశం లేదని సమాచారం. సచివాలయ వ్యవస్థ తోనే పల్లె పాలనను కొనసాగిస్తారని తెలుస్తోంది. అయితే ఈ అనుమానాలను నిజం చేస్తూ.. క్యాబినెట్ లో సీనియర్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.

ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించింది. సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవల బాధ్యతలను అప్పగించింది. అయితే వాలంటీర్లంతా వైసిపి సానుభూతిపరులు అని విపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. ఈ క్రమంలో ఎన్నికల విధుల నుంచి వారిని తొలగించాలని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఎన్నికల సంఘం వాలంటీర్లను విధుల నుంచి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ తరుణంలో ఎన్నికల్లో వాలంటీర్ వ్యవస్థ ప్రచారాస్త్రంగా మారింది. టిడిపి అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారు అంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దానిపై టిడిపి నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. పాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు గౌరవ వేతనంగా పదివేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయినా సరే చాలామంది వలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. ఇప్పుడు వైసిపి ఓటమి చవిచూడడంతో వాలంటీర్లు మాట మార్చారు. వైసీపీ నేతలే తమతో బలవంతంగా రాజీనామా చేయించారని.. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అయితే చంద్రబాబు హామీ ఇచ్చినందున తమను కొనసాగిస్తారన్న ఆశ వాలంటీర్లలో ఉంది. మరోవైపు టిడిపి శ్రేణులు సైతం వాలంటీర్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నాయి. టిడిపి శ్రేణులనుంచి విపరీతమైన పోటీ ఉంది. వీటిని భర్తీ చేస్తే గ్రామస్థాయిలో విభేదాలు తలెత్తే అవకాశం ఉందని కూడా టిడిపి నాయకత్వం భయపడుతోంది. గ్రామానికి ఐదుగురు వాలంటీర్లను మాత్రమే తీసుకునే యోచనలో ఉన్నారని.. అది కూడా డిగ్రీ పూర్తి చేసిన వారికే ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై విధి విధానాలు రూపొందించిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పై కీలక ప్రకటన చేయడానికి టిడిపి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అదే సమయంలో వాలంటీర్లను తొలగించాలంటూ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు అయింది. వారి నియామకాల్లో రిజర్వేషన్లు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

ఇది ఇలా ఉంటే క్యాబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి వాలంటీర్ వ్యవస్థ పై సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అని అభిప్రాయపడ్డారు. గతంలో వాలంటీర్ల మాదిరిగానే ఇంటి ఇంటికి పింఛన్లు పంపిణీ సచివాలయ ఉద్యోగులతో చేపడుతున్నట్లు తెలిపారు. వాలంటీర్లను నియమిస్తే కేవలం పింఛన్ల పంపిణీ పరిమితం చేయమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒకవైపు విధివిధానాలు తయారవుతున్నాయని చెబుతూనే.. వాలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చు అని వ్యాఖ్యానించడం విశేషం. దీంతో రాజీనామా చేయని వాలంటీర్లు సైతం తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Adani Group Airlines

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Srirastu Meaning

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Amazon Employee Quits Job

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oppo A7 Pro Max

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...
Oktelugu Epaper