spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Raj Kesireddy arrest: లిక్కర్ కుంభకోణంలో అసలు కోణాన్ని ఈడీ పట్టేసింది.. అందుకే రాజ్ కేసిరెడ్డి...

Raj Kesireddy arrest: లిక్కర్ కుంభకోణంలో అసలు కోణాన్ని ఈడీ పట్టేసింది.. అందుకే రాజ్ కేసిరెడ్డి అరెస్ట్.. తర్వాత టార్గెట్ అతడే

Raj Kesireddy arrest: ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ పరిధిలో కుంభకోణం జరిగింది. వేల కోట్ల అక్రమ వ్యవహారం ఐదు సంవత్సరాలపాటు దర్జాగా సాగిపోయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం మీద ప్రధానంగా దృష్టి సారించింది.. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థకు సమాచారం అందించింది. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఇందులోకి ప్రవేశించింది. ఆ తర్వాత కీలక ఆధారాలు సేకరించి.. చర్యలు తీసుకుంటున్నది.

మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ రాజ్ కే సి రెడ్డి ని అరెస్ట్ చేసింది. ఇతడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా వ్యవహరించారు. గతంలోనే రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం ఇతడిని అరెస్ట్ చేసింది. ఏడాది పాటు జైల్లో ఉంచింది. ఇటీవల ఇతడు బెయిల్ మీద బయటకు వచ్చాడు. మళ్లీ ఇప్పుడు మనీలాండరింగ్ వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించిన కేంద్ర దర్యాప్తు బృందం.. ఇతడిని అరెస్ట్ చేసింది.

లిక్కర్ వ్యవహారంలో హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్లోని 10 ప్రాంతాలలో కేంద్ర దర్యాప్తు బృందాలు భారీగా సోదాలు నిర్వహిస్తున్నాయి. రాజ్ కేసిరెడ్డి హైదరాబాదులోని నానక్ రామ్ గూడ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. కేవలం ఇతరు మాత్రమే కాదు వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా వ్యవహరించిన కారుమూరు నాగేశ్వరరావు.. అతడి కుమారుడు సునీల్.. వాసుదేవ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

నాడు మద్యం వ్యవహారంలో ఏకంగా 349 కోట్ల వరకు అక్రమాలకు పాల్పడ్డారని.. ఆ డబ్బులను మొత్తం పేరు, ఊరు లేని కంపెనీలకు తరలించాలని.. అనంతరం వాటిని స్థిరాస్థిరంగంలో పెట్టుబడిగా పెట్టారని కేంద్ర దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. ఢిల్లీ కేంద్రంగా కారకాల కొనసాగిస్తున్న సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనే కంపెనీని వాడుకొని.. దాని వెనక రాజ్.. సిండికేట్ వ్యాపారులు 95 శాతానికి పైగా లాభాలను హవాలా మార్గంలో.. మనీలాండరింగ్ మార్గాలలో భారీగా స్థిరాస్థిరంగంలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఓల్ వీక్.. ఆరోయో.. ఈజీ లోడ్ వంటి డమ్మీ కంపెనీలను ఏర్పాటు చేసి.. భారీగా నిధులను అందులోకి పంపించినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘ విచారణ సాగించారు. అనంతరం నాటి ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడంతో.. ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. రాజ్ కేసిరెడ్డి గురించి విజయసా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అతడే సూత్రధారి అంటూ ఆరోపించారు. నాడు జగన్ సూచనలు చేయడంతో సజ్జల శ్రీధర్ రెడ్డికి 100 కోట్ల వరకు సర్దుబాటు చేయాల్సి వచ్చిందని విజయసాయిరెడ్డి ఏకంగా ఈడి అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. అది వైసిపి కి భారీ దెబ్బగా మారింది.

ఈ మద్యం వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు అధికారులు 441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. అంతేకాదు వారి నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటా ప్రకారం జగన్మోహన్ రెడ్డికి తదుపరి నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి డిస్ట్రీలరీల నుంచి దాదాపు 3500 కోట్ల లంచాలు వసూలు చేశారని సమాచారం. అయితే హవాలా.. ఇతర లావాదేవీల వ్యవహారాలను కేంద్ర దర్యాప్తు సంస్థ బద్దలు కొట్టడంతో ఈ స్కాం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఇప్పుడు భయపడిపోతున్నట్టు తెలుస్తోంది.

రాజ్ కేసిరెడ్డిని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి. లిక్కర్ వ్యాపారానికి సంబంధించి జే బ్రాండ్ పేరుతో నాసిరకమైన మద్యాన్ని విక్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు. ఇలా సంపాదించిన డబ్బుతో అక్రమ వ్యాపారాలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఇస్తున్న లీకుల ప్రకారం త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular