spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chaganti Koteswara Rao: ప్రదక్షిణ చేస్తూ ఇతరులతో మాట్లాడుతున్నారా..మీ పుణ్యఫలం గోవిందా...

Chaganti Koteswara Rao: ప్రదక్షిణ చేస్తూ ఇతరులతో మాట్లాడుతున్నారా..మీ పుణ్యఫలం గోవిందా…

Chaganti Koteswara Rao: మనలో చాలామందికి దైవభక్తి అధికంగా ఉంటుంది. వారాలవారీగా ఆలయాలకు వెళ్లే అలవాటు కూడా ఉంటుంది. అవకాశం కుదిరితే దూర ప్రాంతాలలో కొలువై ఉన్న ఆలయాలను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. ఇష్ట దైవానికి మెండుగా పూజలు చేస్తూ.. స్వామివారి కరుణాకటాక్షాలు లభించే విధంగా చూడాలని మొక్కుకుంటాం..

ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేయడం సర్వసాధారణం. కొందరైతే ఫలానా సార్లు ప్రదక్షిణాలు చేస్తామని మొక్కుకుంటారు. కొందరైతే అంగప్రదక్షిణలు కూడా చేస్తుంటారు. తమ నమ్మకం ఆధారంగా పూజలు జరుపుతుంటారు. అయితే ప్రదర్శనలు చేస్తున్నప్పుడు కొందరు నోటికి తాళం వేసుకొని. పక్కవారితో మాట్లాడుకుంటూ ఆ క్రతువును పూర్తి చేస్తుంటారు. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఇలా చేయకూడదట. ఈ విషయాన్ని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఇటీవల వివరించారు. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కచ్చితంగా నియమాలు పాటించాలని ఆయన సూచించారు. ప్రదర్శన చేస్తున్నప్పుడు నోటికి తాళం వేయాలని.. పక్కవారితో కనీసం మాట్లాడకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఇతరులతో మాట్లాడితే ఉపయోగం ఉండదట. దాని వల్ల లభించే పుణ్యం పక్కన ఉన్న వాళ్లకు వెళ్లిపోతుందట. అందువల్లే ప్రతిపానికి ఒక పద్ధతి ఉంటుందని.. భగవత్ సంబంధిత క్రతవులలో శ్రద్ధ పాటించాలని.. క్రమశిక్షణ అనుసరించాలని కోటేశ్వరరావు వివరించారు.

కోటేశ్వరరావు ప్రముఖ ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. దేశవ్యాప్తంగా ఉన్న శైవ, వైష్ణవ క్షేత్రాల గురించి ఆయన అద్భుతంగా వివరిస్తూ ఉంటారు. పైగా సనాతన ధర్మం గురించి లోతుగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. గ్రాంధికంలో పౌరాణిక పద్యాలను చదువుకుంటూ.. వాటి అర్ధాన్ని అర్థవంతంగా చెబుతుంటారు. పైగా ఆయన గొంతు కూడా అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ఆయన ప్రవచనాలను వినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.

ఆమధ్య కోటేశ్వరరావు తమిళనాడులో ఉన్న అరుణాచలం క్షేత్రం గురించి చెప్పారు. ఆ క్షేత్రం గొప్పతనం.. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా వచ్చే ఉపయోగాన్ని వివరించారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం క్షేత్రానికి భక్తులు విరివిగా వెళ్తున్నారు.. ఇలా దేశంలో ఉన్న అనేక క్షేత్రాల గురించి చాగంటి కోటేశ్వరరావు వివరిస్తుంటారు. ఇప్పుడు ఆ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయంటే దానికి ప్రధాన కారణం చాగంటి కోటేశ్వరరావే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Oktelugu Epaper