YS Jagan Vs Ramoji Rao : హనుమంతుడి ముందా కుప్పిగంతులు వేసేది? ఇప్పుడు రామోజీ విషయంలో జగన్ కూడా అలానే ఆలోచించి చేజేతులా ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. మార్గదర్శి కేసులో జగన్ పట్టుబిగిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఆస్తులు అటాచ్ చేసి రామోజీని అబాసుపాలు చేశానని భావిస్తున్నారు. కానీ అంతకంటే మించి మూల్యం చెల్లించుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలు వద్దనుకొని.. అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్షర యుద్ధం ముమ్మరం చేశారు. గతం కంటే మరింత శూల శోధన చేసి కథనాలు రాస్తున్నారు. అవి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.
మార్గదర్శి కేసులో ఎన్నిరకాల ఇబ్బందులు ఎదురవుతున్నా.. ఆస్తులు అటాచ్ అవుతున్నా రామోజీరావు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.అనంతపురం లేపాక్షి భూముల అక్రమాల విషయంలో ఈనాడు ప్రచురించిన కథనం అధికార పార్టీలో ప్రకంపనలే రేపింది. ఒక్కొక్కరి ఫ్యూజులు కదిలిపోతున్నాయి. నాటి దందాను గుర్తుచేస్తూ భారీ కథనాన్నే రాసింది. అక్కడి ప్రజలు ఎలా మోసం చేసిందో వివరించింది. ఆ భూములను ఇప్పటికీ కొట్టేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని బయటపెట్టింది. రామోజీరావుపై ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తున్నా వెనక్కి తగ్గపోవడంతో మున్ముందు ఈనాడు ద్వారా చుక్కలు చూపించడం ఖాయమని వైసీపీ నేతలు భయపడిపోతున్నారు.
ఈనాడు సర్క్యూలేషన్ ఇటీవల అమాంతం పెరిగింది. మార్గదర్శి కేసులతో జగన్ సర్కారుపై ఈనాడు కౌంటర్ అటాక్ ప్రారంభించింది. సర్కారు అక్రమాలు, పాలనా వైఫల్యంపై వరుసగా కథనాలు ప్రచురిస్తోంది. దీంతో పాఠకాదరణ పెరిగింది. సర్క్యూలేషన్ కూడా గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అటు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలను కూడా ఈనాడు స్వీకరించడం లేదు. వారి దగ్గర ప్రకటనలు తీసుకొని..అదే ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాయడం తప్పుడు సంకేతమని భావించి ఈ నిర్ణయానికి వచ్చింది. ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ఈనాడులో పెరిగాయో.. నాటి నుంచే ఈనాడు సర్క్యూలేషన్ పెరుగుతూ వచ్చింది. సచివాలయాలు, వలంటీర్లకు సాక్షి పత్రికను అందిస్తున్నా ఈనాడు సర్వ్యూలేషన్ కు మాత్రం అందుకోలేకపోతోంది.
మార్గదర్శి కేసుతో ఈనాడును కట్టడిచేయాలని జగన్ సర్కారు చూస్తోంది. అందకే మార్గదర్శిపై కేసులు పెరిగాయని.. త్వరలో బ్రాంచ్ లు మూయిస్తామని హెచ్చరిస్తోంది. అంతటితో ఆగకుండా సీఐడీ చీఫ్ తో ప్రత్యేక ప్రెస్ మీట్లు ఏర్పాటుచేయించింది. మార్గదర్శిలో అంతులేని అక్రమాలు జరిగాయని చెప్పించే ప్రయత్నం చేస్తోంది. అయినా సరే ఈనాడు వెనక్కి తగ్గడం లేదు. మార్గదర్శిపై కేసుల ద్వారా రామోజీకి పెయిన్ కల్పించాలని చూసినా… అంతకంటే మించి పెయిన్ ఈనాడు ద్వారా జగన్ సర్కారు ఎదుర్కొంటోంది. అటు ఈనాడు శూలశోధన చేసి మరి అక్రమాలపై గణాంకాలతో సహ వివరిస్తోంది. దీంతో జగన్ సర్కారు మైండ్ బ్లాక్ అవుతోంది. బొమ్మ కనిపిస్తోంది.