Homeఆంధ్రప్రదేశ్‌AP Rain Alert : ఏపీకి బిగ్ అలెర్ట్.. ముంచుకొస్తున్న ముప్పు!

AP Rain Alert : ఏపీకి బిగ్ అలెర్ట్.. ముంచుకొస్తున్న ముప్పు!

AP Rain Alert  : తెలుగు రాష్ట్రాలకు( Telugu States) భారీ వర్ష సూచన. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడిన కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. మే 19 నుంచి 23 వరకు ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దక్షిణ గుజరాత్ వద్ద ఈశాన్య అరేబియా సముద్రం పై వాయు తుఫాను కొనసాగుతోంది. మే 21 నాటికి కర్ణాటకలో తీరం దాటే అవకాశం ఉంది. దీని కారణంగా మే 20 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.

Also Read : ఏపీలో ఆ ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెంపు!

* బెంగళూరులో భారీ వర్షాలు..
మరోవైపు అండమాన్ నికోబార్( Andaman Nicobar) దీవులకు నైరుతి రుతుపవనాలు తాకాయి. ఈనెల 27న కేరళకు తాకనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బెంగళూరులో భారీ వర్షాలు పడుతున్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వీధులతోపాటు ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. రోడ్డు మీద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. బెంగళూరు వాసులు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు.

* రానున్న మూడు రోజుల్లో..
రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు( heavy rain) పడే సూచన కనిపిస్తోంది. ఆ సమయంలో భారీ ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అనకాపల్లి, అన్నమయ్య, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

* జూన్ మొదటి వారంలో ఏపీకి..
మరోవైపు జూన్ మొదటి వారంలో( June first week ) ఏపీలో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. ఆ సమయంలో భారీ తుఫాన్లు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది గతం కంటే భిన్నంగా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. మొత్తానికి అయితే ముందుగానే రుతుపవనాల రాకతో చల్లటి వాతావరణం రానుంది.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular